logo

కరెంటు లేక కష్టాలు

అసలే ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలవరం ప్రజలు సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. జగన్నాథపేట వద్ద పరివర్తకంలో సమస్యతోపాటు పలు చోట్ల తీగలు తెగిపోవడంతో జగన్నాథపేట,

Published : 01 May 2024 05:02 IST

సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫ్యాన్లు తిరగక రోగుల అవస్థలు

పోలవరం, న్యూస్‌టుడే: అసలే ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలవరం ప్రజలు సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. జగన్నాథపేట వద్ద పరివర్తకంలో సమస్యతోపాటు పలు చోట్ల తీగలు తెగిపోవడంతో జగన్నాథపేట, కమ్మరగూడెం, నూతనగూడెం ప్రాంతాలకు సరఫరా నిలిచిపోయింది. ఫ్యాన్లు తిరగక ప్రజలు ఉక్కపోతతో తెల్లవార్ల్లూ ఉక్కిరిబిక్కిరయ్యారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులు సైతం ఇబ్బందులు పడ్డారు. మోటార్లు పనిచేయకపోవడంతో నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాను తాత్కాలికంగా పునరుద్ధరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని