పథకాల బాకానే.. ప్రగతి ఊసేది
సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు.
పోలవరం, కొల్లేరు, చింతలపూడి మాటే ఎత్తని సీఎం
ఈనాడు, ఏలూరు: సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు. ఏలూరు జిల్లాలో పర్యటిస్తూ పోలవరం..ఊసే లేకుండా..కొల్లేరు ప్రస్తావనే లేకుండా..చింతలపూడి ఎత్తిపోతల, ట్రిపుల్ ఐటీ గురించి మాట్లాడకుండా ప్రసంగం సాగిందంటేనే సభ ఎంత పేలవంగా సాగిందో ఊహించుకోవచ్చు. జగన్ ప్రసంగం మొత్తం బటన్ నొక్కుడు గురించి జబ్బలు చరుచుకుంటూనే సాగింది. పోలవరం నిర్వాసితుల గురించి జగన్కు గుర్తురాలేదు. వైకాపా అసమర్థతతోఅర్ధంతరంగా నిలిచిన చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి నోరు విప్పలేదు. నిధుల్లేక ఏలూరులో నిలిచిన భూగర్భ డ్రెయినేజీ, పత్తాలేకుండా పోయిన రూర్బన్ పనుల గురించి, అధ్వానంగా ఉన్న జిల్లా రహదారుల గురించి మాట్లాడలేదు. పథకాలు రావాలంటే జగనే రావాలన్నట్లు ప్రజలను సున్నితంగా బెదిరించడంతోనే సమయమంతా సరిపోయింది.
అభ్యర్థులకు నోరెత్తే అవకాశం ఇవ్వలే..
సాధారణంగా నియోజకవర్గానికి ఏ పార్టీ అధినేతలు వచ్చినా స్థానిక అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులకు ముందుగా మాట్లాడే అవకాశం ఇస్తారు. సీఎం సభ మాత్రం భిన్నంగా సాగింది. ఆద్యంతం పథకాల గురించి ఊకదంపుడు ఉపన్యాసం తప్ప వారికి అవకాశం ఇవ్వలేదు. ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నానిల గురించి మాట్లాడుతూ..వీరు ఎంతో మంచివారని, సౌమ్యులని, ప్రజలకు సేవ చేయాలనే గుణం కలిగిన వారని ఉద్ఘాటించారు.
నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్లు
ఓ పక్క ఎన్నికల నియమావళి నిబంధనలు ఉన్నా వైకాపా నాయకులు దాన్ని తుంగలో తొక్కారు. నగరంలో ఎక్కడ చూసినా జగన్, ఎమ్మెల్యే ఆళ్ల నానికి సంబంధించిన భారీ హోర్డింగ్లు హెలిప్యాడ్ సభా ప్రాగణం మధ్యలో ఏర్పాటు చేశారు.
డబ్బులిచ్చి తరలించినా తుర్రుమన్నారు
సభకు జనాన్ని తరలించేందుకు వైకాపా నాయకులు భారీగా డబ్బులు పంపిణీ చేశారు. నగరంలోని 50 డివిజన్లకు రూ.50 లక్షలు కేటాయించారు. ఒక్కొక్క డివిజన్ నుంచి 500 మంది వరకు తరలించారు. ఒక్కొక్కరికి రూ.200, మద్యం సీసా, బిర్యాని పొట్లాం ఇచ్చి ఆటోల్లో తరలించారు. కొన్ని చోట్ల పథకాల పేరుతో డ్వాక్రా లీడర్లు బెదిరించి బలవంతంగా తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకే వీరిని తీసుకురావటంతో ఎండల్లో ఉక్కిరిబిక్కిరై జగన్ రాకముందే చాలా మంది వెళ్లిపోయారు. ఉన్నవారు సైతం ఎండ తీవ్రత తట్టుకోలేక జగన్ ప్రసంగిస్తుండగానే వందల సంఖ్యలో తరలివెళ్లిపోయారు. డబ్బులిస్తామని తీసుకొచ్చి..ఎండలో మాడ్చారు. సభ అయ్యాక ఇస్తారో లేదో’ అని కొందరు మహిళలు ఆవేదన చెందుతూ వెనుదిరిగిన దృశ్యాలు కనిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాల మీదకొచ్చినా స్పందించరా?
[ 17-05-2024]
ఏజెన్సీలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు గిరిపుత్రుల ప్రాణాలు తోడేస్తోంది. కుక్కునూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుక్కెడు తాగునీటికి నోచుకోక చెలమల్లోని మురికి నీరు తాగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటమే ఈ మరణాలకు కారణమైంది. -
ఆగని అరాచకపర్వం
[ 17-05-2024]
పోలింగ్ నాడు వైకాపా మూకలు చేసిన విధ్వంసకాండ..వారు గత అయిదేళ్లుగా చేస్తున్న అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది. పచ్చని పశ్చిమలో నెత్తుటి ఛాయలు చూపించింది. ఓటమి భయం ఆవరించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటమే లక్ష్యంగా పని చేశారు. -
కలిసి రాని కొబ్బరి!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. పెదవేగి, యలమంచిలి మండలాలు కొబ్బరిసాగులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యానంలో పెద్దపంటగా భావించే కొబ్బరిలో తెగుళ్ల బెడద తీవ్రస్థాయికి చేరింది. -
తేమ పేరుతో కోత
[ 17-05-2024]
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. -
ఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉదయం జరిగిన అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షకు మొత్తం 175 మంది హాజరు -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ ?
[ 17-05-2024]
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 118 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 66 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాక వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. -
అర్ధరాత్రి ఇసుక దందా
[ 17-05-2024]
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. -
నెత్తురోడిన రహదారులు
[ 17-05-2024]
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని రహదారులు గురువారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. -
కొప్పులవారిగూడెం ఘటనపై పోలీసుల అత్యుత్సాహం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో(ఈ నెల 13న) పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. -
లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె
[ 17-05-2024]
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!