ఉప్పు రైతు బతుకు చేదు
ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి
సాగుకు దూరమవుతోన్న వైనం
నెరవేరని జగన్ హామీలు
తీరంలో ఉప్పుసాగు
ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి. నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి మొగల్తూరు మండలం మోళ్లపర్రు వరకు 19 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. దీని వెంబడి ఉన్న తొమ్మిది గ్రామాల ప్రజలకు అనాదిగా ఆ సాగే జీవనాధారమైంది.
నరసాపురం(తూర్పుతాళ్లు), న్యూస్టుడే: ‘సముద్ర తీరంలో ఉప్పు సాగు చేసే రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఈ సాగును పంటగా గుర్తిస్తాం.. విద్యుత్తు, రహదారుల సౌకర్యం కల్పిస్తాం. గోదాములు, ప్లాట్ఫాంలు ఏర్పాటు చేస్తాం’ అని గతంలో నరసాపురం పర్యటన సమయంలో పీఎంలంకలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ హామీ ఇచ్చారు. అయిదేళ్లు సీఎంగా ఉన్న జగన్ ఏనాడూ ఉప్పు సాగుపై ఒక్క ప్రకటన కూడా చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయిదేళ్ల వైకాపా పాలనలో ఉప్పు సాగు రైతులకు ఒరిగింది ఏమీలేదు. వర్షాలు, విపత్తులకు ఉప్పు పంట నీటమునిగి రైతులు నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఆ సమయంలో ఆ ప్రాంతాలను పరిశీలించడంతోనే సరి. కనీసం ఒక్కసారి కూడా నష్టపరిహారం ఇప్పించలేదు. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో ఉప్పు సాగుకు రైతులు దూరమై పోయారు. కాలక్రమేణా ఇతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. కూలి రేట్లు పెరిగాయి. గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి పెరిగిపోవడంతో సాగు తగ్గిపోతోంది. గతంలో 2 వేల ఎకరాలున్న సాగు ప్రస్తుతం వందల ఎకరాలకు పరిమితమైంది.
ఇవీ కష్టాలు..
వైకాపా ప్రభుత్వం ఉప్పు సాగును పంటగా గుర్తించ లేదు. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సాయం అందడం లేదు. రుణాలు అందక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఇందుకు రూ.5 నుంచి 6 వడ్డీ కడుతున్నారు. అంతే కాకుండా ఆయా వ్యాపారులు పంటను తమకే అమ్మాలని డిమాండ్ చేస్తున్నారు. తీరా విక్రయిస్తే మార్కెట్ ధర ఇవ్వరు. అదేమని అడిగితే అప్పు కట్టమని ఒత్తిడి తెస్తున్నారు. తూకాల్లో వ్యత్యాసంతో రైతులు నష్టపోతున్నారు. తీరంలో ఉప్పుమడులకు వెళ్లేందుకు సరైన రవాణా మార్గాలు లేవు. దీనికి తోడు మడులకు నీరు తోడుకోవడానికి విద్యుత్తు సౌకర్యం, ఉప్పును భద్రపరుచుకోవడానికి ఫ్లాట్ఫాం, గోదాము సౌకర్యాలు లేవు. దీంతో రైతులు ఈ పంట సాగుకు సాహసించడం లేదు.
ఏటా నష్టాలే..
‘ప్రకృతి విపత్తులు, వర్షాలకు గోదాము, రవాణా సౌకర్యం లేకపోవడం భద్రపరుచుకోవడం కష్టంగా మారుతోంది. ఆర్థికంగా ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏటా నష్టాలు తప్పడం లేదు. సాగును వదిలేశా’ అని తూర్పు తాళ్లుకు చెందిన పులపర్తి శ్రీనివాస్ వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాల మీదకొచ్చినా స్పందించరా?
[ 17-05-2024]
ఏజెన్సీలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు గిరిపుత్రుల ప్రాణాలు తోడేస్తోంది. కుక్కునూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుక్కెడు తాగునీటికి నోచుకోక చెలమల్లోని మురికి నీరు తాగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటమే ఈ మరణాలకు కారణమైంది. -
ఆగని అరాచకపర్వం
[ 17-05-2024]
పోలింగ్ నాడు వైకాపా మూకలు చేసిన విధ్వంసకాండ..వారు గత అయిదేళ్లుగా చేస్తున్న అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది. పచ్చని పశ్చిమలో నెత్తుటి ఛాయలు చూపించింది. ఓటమి భయం ఆవరించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటమే లక్ష్యంగా పని చేశారు. -
కలిసి రాని కొబ్బరి!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. పెదవేగి, యలమంచిలి మండలాలు కొబ్బరిసాగులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యానంలో పెద్దపంటగా భావించే కొబ్బరిలో తెగుళ్ల బెడద తీవ్రస్థాయికి చేరింది. -
తేమ పేరుతో కోత
[ 17-05-2024]
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. -
ఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉదయం జరిగిన అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షకు మొత్తం 175 మంది హాజరు -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ ?
[ 17-05-2024]
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 118 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 66 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాక వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. -
అర్ధరాత్రి ఇసుక దందా
[ 17-05-2024]
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. -
నెత్తురోడిన రహదారులు
[ 17-05-2024]
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని రహదారులు గురువారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. -
కొప్పులవారిగూడెం ఘటనపై పోలీసుల అత్యుత్సాహం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో(ఈ నెల 13న) పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. -
లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె
[ 17-05-2024]
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు