పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల వీడియో గ్రాఫర్పై వైకాపా శ్రేణుల దాడి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వీడియోగ్రాఫర్, అధికారిపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమర్రులో ఈ ఘటన జరిగింది.
పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వీడియోగ్రాఫర్, అధికారిపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమర్రులో ఈ ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారాన్ని వీడియో తీస్తుండగా వీడియోగ్రాఫర్ తాళ్ల శ్రీనివాస్, అధికారి సీతారామరాజుపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, పిడిగుద్దులతో దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తాళ్ల శ్రీనివాస్ సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు స్పందించి ఆయనను హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు