ఖాకీలపై కాఠిన్యం
నిత్యం పని ఒత్తిడి ఎదుర్కొంటూ.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తిస్తూ.. బాధితులకు భరోసానిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు.
జగన్ జమానాలో ముందస్తు ఆరోగ్య పరీక్షల రద్దు
అటకెక్కిన వారాంతపు సెలవులు
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: నిత్యం పని ఒత్తిడి ఎదుర్కొంటూ.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తిస్తూ.. బాధితులకు భరోసానిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు. బందోబస్తు విధుల్లో సతమతమవుతూ.. వీవీఐపీలకు, వీఐపీలకూ భద్రత కల్పిస్తూ.. తమ ఆరోగ్యాన్ని గాలికి వదిలేసే పోలీసులను సైతం సీఎం జగన్ వాడుకొని వదిలేశారు. అధికారంలోకి రాగానే అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ బూటకపు హామీలిచ్చి.. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సొంత ప్రయోజనాలకు మాత్రమే వారిని వాడుకున్నారు. ప్రభుత్వపరంగా అందాల్సిన రాయితీలు సైతం సకాలంలో అందించకుండా మోసం చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడున్నర వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ విధులు, బందోబస్త్లు, వీవీఐపీ పర్యటనలు, ముఖ్యమంత్రి, మంత్రుల సభలు, సమావేశాలకు బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అయిదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో పోలీసులకు అందాల్సిన రాయితీలు, జీపీఎఫ్, సరండర్ సెలవులు, అరియర్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్నందున... పోలీసులను తమ వైపునకు తిప్పుకొనేందుకు జగన్ గట్టి ప్రయత్నమే చేశారు. ఇప్పటివరకు ఇవ్వని సరండర్ సెలవుల సొమ్ములను గత వారం రోజులుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తద్వారా పోలీసుల్లో తమపైనున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పాచిక వేశారు.
పెళ్లికి అప్పు చేసి...
ఏలూరులో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గతేడాది తన కుమార్తె వివాహానికి నగదు అవసరమైంది. జీపీఎఫ్కు దరఖాస్తు చేసుకోగా.. సకాలంలో డబ్బు చేతికందలేదు. దాంతో ఆమె అప్పుచేసి కుమార్తె పెళ్లి చేశారు. ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు.
ఉల్లాసం... ఉత్సాహం కరవు..
ప్రస్తుతం పోలీసులకు ఉల్లాసం, ఉత్సాహం కరవైంది. గతంలో యోగా, మానసిక ప్రశాంతతకు శిక్షణ తరగతులను నిర్వహించేవారు. ప్రస్తుతం వాటి జాడే కనుమరుగైంది. ముఖ్యంగా పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తామంటూ గత ఎన్నికల వేళ హామీనిచ్చిన సీఎం జగన్... అధికారంలోకి ఆ మాటను విస్మరించింది. ప్రస్తుతం సెలవులు లేకపోవడంతో నిత్యం పోలీసులు విధులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బందోబస్తు, పికెటింగ్, వాహనాల తనిఖీలు, కార్యాలయాల ముట్టడిని విఫలం చేయడం తదితర విధులతో పోలీసులు సతమతమవ్వాల్సి వస్తోంది. అయిదేళ్ల జగన్ సర్కారుతో విసిగిపోయామని... తమకు రావాల్సిన, ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోగా అదనంగా విధులు నిర్వహించాల్సి వచ్చిందని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్యం... గాల్లో దీపం
గత తెదేపా ప్రభుత్వం పోలీసుల ఆరోగ్య భద్రతపై ప్రధాన దృష్టిపెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసుల పక్షపాతిగా వ్యవహరించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ సంక్షేమానికి రూ.15 కోట్లు కేటాయించారు. అలాగే ఏడాదికి 2 దఫాలుగా ముందస్తు మెగా ఆరోగ్య పరీక్షలు చేయించారు. నిపుణులైన వైద్యులతో జిల్లా పోలీసు కార్యాలయం వద్దే భారీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ముందస్తుగానే వ్యాధి తీవ్రతను గుర్తించి... తదనుగుణంగా తగిన వైద్యం అందించేవారు. పోలీసులతోపాటు వారి కుటుంబాలకూ పరీక్షలు నిర్వహించేవారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అయిదేళ్లుగా ఆరోగ్య పరీక్షలు నిలిపివేయడంతో... పలువురు పోలీసులు అనారోగ్యాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు.
గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతి...
టి.నరసాపురం పరిధిలో పని చేస్తున్న ఓ హెడ్కానిస్టేబుల్ పది నెలల కిందట గుండెపోటుతో మరణించారు. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. పోలీసు శాఖాపరంగా ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఉంటే... ప్రమాదాన్ని గుర్తించేవారు. తగిన చికిత్స చేయించుకొని మృత్యువు నుంచి బయటపడేవారని పలువురు సహచర సిబ్బంది చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!