మీ పాలనలో రోజూ అమావాస్యే
జగనన్న జమానాలో నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రివేళ వెలుగులు కనుమరుగై... చీకట్లు రాజ్యమేలుతున్నాయి.
వీధి దీపాల సమస్యను పట్టించుకోని జగన్ సర్కారు
జగనన్న జమానాలో నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రివేళ వెలుగులు కనుమరుగై... చీకట్లు రాజ్యమేలుతున్నాయి. వీధి దీపాల నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా... దీపాలు మాత్రం వెలగడం లేదు. జిల్లా కేంద్రాలైన ఏలూరు, భీమవరంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో సైతం వెలుగుల జిలుగులు కానరావడం లేదు. పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోనూ సమస్య జటిలంగానే ఉంటోంది. ఇక శివారు ప్రాంతాలు పొద్దుపోతే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరమ్మతులకు గురైన దీపాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలంకారప్రాయంగా..
పాలకొల్లు పట్టణం, న్యూస్టుడే: పురపాలక పరిధిలో 31 వార్డుల్లో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి వార్డులోనూ దీపాలు వెలగకపోవడంతో పురప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బËంగారువారిచెరువుగట్టు, బ్రాడీపేట, లజపతిరాయ్పేట, హౌసింగ్బోర్డుకాలనీ, సూర్యతేజనగర్, సుబ్బారాయుడుగుడికూడలి, అన్నంవారివీధి, మఠంవీధి వంటి పలు ప్రాంతాల్లో సగానికి పైగా వీధిదీపాలు వెలగడం లేదు. ఎనర్జీస్ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) వీధి దీపాల నిర్వహణ చేస్తున్నా పలు వార్డులు అంధకారంలోనే ఉన్నాయి. వైకాపా అధికారంలో వచ్చిన నాటి నుండి రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో రాత్రి సమయాల్లో రహదారులపై గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.
పై చిత్రం 6వ వార్డు బొండాడవారివీధిలోనిది. ఆ వీధి పొడవునా 6 విద్యుత్తు దీపాలు ఉండగా 3 మాత్రమే వెలుగుతున్నాయి. స్థానిక మఠంవీధిలో సుమారు 8 వీధి దీపాలు వెలగాల్సి ఉండగా 4 పాడయ్యాయి. స్థానిక బ్యాంక్ కాలనీ దేవునితోట వరకు 10 దీపాలకు 4 వెలగడం లేదు.
ఆవిరైన నిధులు..కానరాని కాంతులు
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: చీకటి పడితే చాలు తాడేపల్లిగూడెం పట్టణం అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. ఏటా వీధి దీపాల నిర్వహణకు రూ.2 కోట్లకు పైగా వెచ్చిస్తున్నా.. ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. వార్డుల్లోనే కాదు ప్రధాన కూడళ్లు, రహదారులపై వీధి దీపాలు వెలగని పరిస్థితి. దీనికి తోడు గుంతల రోడ్లు వాహనచోదకుల ప్రాణాలను తీస్తున్నాయి. నాసిరకం ఎల్ఈడీ దీపాల ఏర్పాటు చేయడంతో అవి తరచూ మరమ్మతుకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలే మొన్నటి వరకు వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టు తీసుకున్నారు.
నడిరోడ్లపై అంధకారం
నరసాపురం పురపాలక సంఘంలోని వివిధ ప్రాంతాల్లో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. రాత్రివేళ ప్రధాన కూడళ్లు, ముఖ్య వీధుల్లోనూ చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి. పట్టణ నడిబొడ్డునున్న స్టీమర్రోడ్డులోనే దీపాలు వెలగకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. క్రిస్టియన్పేట, పంటురేవు తదితర ప్రాంతాల్లోనూ అంధకారం రాజ్యమేలుతోంది. వీధి దీపాలను వెలగకపోవడాన్ని ఆసరాగా చేసుకొని... ఆయా ప్రాంతాల్లో దొంగలు మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారైన సంఘటనలు కోకొల్లలు.
న్యూస్టుడే, నరసాపురం
నామమాత్రంగా దీపాలు
జిల్లా కేంద్రం భీమవరంలోనూ వీధిదీపాల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రధాన వీధులు, కూడళ్లలోనూ దీపాలు వెలగడం లేదు. ప్రాంతీయాసుపత్రికి వెళ్లే దారిలో పన్నెండు స్తంభాలుండగా... అందులో ఎనిమిదింటికి దీపాలు ఏర్పాటు చేయలేదు. మిగతా నాలుగు స్తంభాలకు దీపాలు బిగించగా మూడు వెలగకపోవడంతో పరిస్థితికి అద్దంపడుతోంది. భీమవరం- ఉండి మార్గంలోనూ వీధి దీపాలు వెలుగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
న్యూస్టుడే, భీమవరం పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్