కొల్లేరు రాజ్యంలో అరాచకాసురుడు
అది ప్రశాంత కొల్లేరు ప్రాంతం.. ఆ నేతను ఎన్నుకోవడంతో అరాచక రాజ్యంగా మారింది. హింసాత్మక ధోరణి చెలరేగింది. ప్రశ్నిస్తే దౌర్జన్య కాండకు పాల్పడటం.. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం ఆ నేత నైజం.
ప్రశ్నిస్తే కిరాయి మూకలతో దాడులు
ఎదగాలనుకున్న వారిని అణగదొక్కే నైజం
నేత దాష్టీకాలకు చివురుటాకులా ప్రజలు
ఈనాడు, ఏలూరు
అది ప్రశాంత కొల్లేరు ప్రాంతం.. ఆ నేతను ఎన్నుకోవడంతో అరాచక రాజ్యంగా మారింది. హింసాత్మక ధోరణి చెలరేగింది. ప్రశ్నిస్తే దౌర్జన్య కాండకు పాల్పడటం.. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం ఆ నేత నైజం. పోలీసులను బానిసలుగా చూస్తారు.. ఇదేమిటని ప్రశ్నిస్తే బదిలీ బహుమతితో సత్కరిస్తారు. పదవి తండ్రిదైనా పెత్తనం కొడుకులదే.
సాధారణంగా నాయకులు ఎదుటి పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు. ఈ నేత మాత్రం తన గెలుపునకు సహకరించిన సొంత పార్టీ నేతలు ఎక్కడ ఎదుగుతారో అన్న అభద్రతా భావంతో కక్షసాధింపులకు పాల్పడతారు. ‘వైకాపా ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడ్డాం నామినేటెడ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి’ అని అడిగినందుకు ఓ మహిళా నేతను ఇంటికి పిలిపించి దుర్భాషలాడి అవమానించారు. అది చాలక స్టేషన్కు రప్పించి ఓ ఎస్సైతో బెదిరింపులకు గురి చేశారు. దీనికి తలొగ్గని ఆ మహిళా నేత భారీఎత్తున అవినీతి చేస్తున్నారని ప్రచారం చేశారు. దీంతో ఒక కార్యక్రమానికి హాజరై వెళ్తున్న మహిళా నేత, అతని భర్తపై రౌడీ మూకలతో దాడి చేయించారు. స్టేషన్కు రప్పించి పోలీసుల ఎదుటే ఆమె భర్తపై దాడికి దిగారు. వీరి కోసం వచ్చిన మరో బీసీ నేతపై పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయించారు.
’డీ’ గ్యాంగ్ అరాచకాలు.. గ్రామాల్లో అధికార పార్టీపైగానీ నాయకులపై గాని విమర్శలు చేసినా..ప్రశ్నించినా వెంటనే ఈ ‘డీ’ గ్యాంగ్ రంగంలోకి దిగుతోంది. పోలీస్స్టేషన్లోనే వీరి రౌడీ పంచాయితీలన్నీ జరుగుతాయి. పోలీసుల ఎదుటే వీరు ఎంతో మందిని చితకబాదటంతో ప్రజలకు పోలీసులపైనే నమ్మకం పోయింది. నియోజకవర్గ కేంద్రంలోని ఓ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను సమస్యలపై ప్రశ్నించారనే కారణంతో ఓ యువకుడి చరవాణి తీసుకుని పోలీస్ స్టేషన్కు రప్పించి ముప్పుతిప్పలు పెట్టారు.
పెడితే మా ఫ్లెక్సీలే పెట్టాలి.. గ్రామాల్లో తమను కాదని వేరే నాయకుల ఫ్లెక్సీలు పెట్టినా ఎమ్మెల్యే అహం దెబ్బ తింటుంది. ఓ గ్రామంలో ఓ యువకుడు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా రాజకీయ విభేదాలు సృష్టించారు. దీంతో గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు పాల్పడగా జనసేనకు చెందిన యువకులపై అక్రమంగా కేసులు బనాయించారు. ప్రభుత్వానికి సంబంధం లేని ఓ కార్యక్రమానికి అడ్డుపడుతున్నాడని జనసేనకు చెందిన ఓ యువనేతపై ప్రతాపం చూపారు. ఎమ్మెల్యే సభకు కట్టిన ఫ్లెక్సీలు ఎవరో చింపితే గ్రామంలో చదువుకుంటున్న ముగ్గురు యువకులను కేసుల్లో ఇరికించారు.
వ్యతిరేకిస్తే అంతే సంగతులు.. 2019లో వైకాపాకు ఓటేయలేదని కొల్లేరులో మంచినీటి కోసం ఏర్పాటు చేసుకున్న చెరువును అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే కొట్టించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కొల్లేరు లంక గ్రామానికి చెందిన యువత ప్రశ్నించడంతో దుర్భాషలాడి అంతు తేలుస్తానని వీరంగమాడారు. నియోజకవర్గంలో మండల గ్రామ స్థాయి నాయకులు నిమిత్త మాత్రులే. చిన్న పని చేయాలన్నా అధికారులకు సదరు నేత కొడుకు ఫోన్ చేయాల్సిందే. లేదంటే ఎన్ని రోజులైనా దస్త్రాలు ముందుకు కదలవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్