సీసాలో భూతం
నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు మీదకు తెచ్చుకొంటున్నారు. కాలేయం, మూత్రపిండాలు, మెదడు సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.
ఉసురు తీస్తోన్న నకిలీ మద్యం
పెరుగుతున్న కాలేయ, మూత్రపిండాల వ్యాధిగ్రస్థులు
ఎన్నికల మద్యం దిగుతున్న వేళ మరింత అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే- ముదినేపల్లి, పోలవరం, చింతలపూడి
నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు మీదకు తెచ్చుకొంటున్నారు. కాలేయం, మూత్రపిండాలు, మెదడు సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పెద్ద దిక్కును పోగొట్టుకుని పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపకాలు జోరుగా సాగుతున్నాయి. గోవా తదితర ప్రాంతాల నుంచి నకిలీ మద్యం దిగుమతవుతోంది. ఊరికే వస్తుంది కదా అని మందుబాబులు తాగితే అవస్థలు పడక తప్పదు. ఈ మద్యం తాగటంతో కాలేయం, మూత్ర పిండాల వ్యాధులతోపాటు భయం, గుండె దడ, నిద్ర రాకపోవటం, ఆకలి లేమి, కామెర్లు, వాంతులు, విరేచనాలు, నరాల తిమ్మిర్లు వంటి ఇబ్బందులతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో నియంత్రణ లేకుండా తాగితే ప్రాణానికే ముప్పని హెచ్చరిస్తున్నారు.
తణుకుకు చెందిన మట్టా నాగయ్యకు 12 ఏళ్లుగా మద్యం తాగే అలవాటుంది. రెండేళ్ల క్రితం కడుపులో మంట రావటంతో వైద్యుడిని సంప్రదిస్తే మద్యం తాగటం వల్లే లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. పట్టించుకోకుండా కొనసాగించడంతో మృతి చెందారు. ఏడాది క్రితమే కొడుకు కూడా చనిపోవటంతో నాగయ్య భార్య దిక్కులేనిదై..కూలి పనులతో జీవనం సాగిస్తోంది.
పెరుగుతున్న రోగులు..
ఉమ్మడి జిల్లాలో దాదాపు ఆరు ప్రైవేటు జీర్ణకోశ వ్యాధుల ఆసుపత్రులున్నాయి. ఇక్కడికి రోజుకు 800 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. వీరిలో మద్యంతో అనారోగ్యం పాలైన వారు 300 మంది వరకు ఉంటారు. అయిదేళ్ల క్రితం ఓపీ 350 ఉంటే 70 మంది మాత్రమే మద్యం అలవాటుతో అనారోగ్యం పాలైనవారు వచ్చేవారు. ప్రస్తుతం ఏలూరు వైద్య కళాశాల జీర్ణకోశ వ్యాధుల విభాగంలో 40 మంది చికిత్స పొందుతున్నారు వారిలో 21 మంది వరకు మద్యం తాగటంతో అనారోగ్యం పాలైన వారే ఉన్నారు. ప్రాణాలు కోల్పోతున్నవారిలో 90 శాతం మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే కావడంతో వారి కుటుంబాలు ఛిన్నాభిన్నవుతున్నాయి.
భర్త, అల్లుడు తాగుడుతో చనిపోయారు
మా అల్లుడికి, భర్తకు చాలా ఏళ్ల నుంచి మద్యం తాగే అలవాటుంది. మూడేళ్ల క్రితం అల్లుడు విపరీతంగా మద్యం తాగుతూ లివర్ సమస్యతో చనిపోయారు. నా కూతురు దిక్కులేనిదైంది. నా భర్త మద్యం అలవాటు మానుకోలేదు. దీంతో కాలేయ ఇన్ఫెక్షన్తో ఆరు నెలల క్రితం చనిపోయారు. ఇద్దరి మరణాలతో మా కుటుంబం రోడ్డున పడింది.
దోర నాగమణి, ఎల్ఎన్టీపేట, పోలవరం మండలం
కొడుకు, కూతురు కూలిపనులు చేస్తున్నారు
ముఠా పనికి వెళ్లే నా భర్తకు 15 ఏళ్ల నుంచి మద్యం అలవాటుంది. రెండేళ్లుగా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. స్థోమత లేకున్నా చాలా ఆసుపత్రులకు తిప్పా. మద్యం తాగటంతో లివర్ బాగా చెడిపోయిందని చెప్పారు. డబ్బుల్లేక ఆరు నెలల క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడే చనిపోయారు. దీంతో దిక్కులేక నా కొడుకు, కూతురు చదువు మానేసి కూలి పనులకు వెళుతున్నారు.
మురారి నాగమణి, ముదినేపల్లి
దిక్కు లేకుండా పోయింది
నా భర్త థామస్ గత నాలుగేళ్ల నుంచి సారా, మద్యం విపరీతంగా తాగడంతో ఆరోగ్యం పాడైంది. దాదాపు ఏడాది పాటు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. లివర్పూర్తిగా పాడైందని వైద్యం చేసినా ఫలితం లేదని వైద్యులు చెప్పారు. గతేడాది చనిపోయారు. కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే దిక్కు లేకపోవటంతో అప్పటి నుంచి నేనే కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకుంటున్నా.
కుంపటి నాగమణి, ఫాతిమాపురం, చింతలపూడి మండలం
తాగుడుతో టీబీ వచ్చింది
మద్యం తాగటంతో మా నాన్నకు టీబీ వచ్చిందని వైద్యులు చెప్పారు. మద్యం మానేయమన్నా వినకపోవటంతో వారం క్రితం ఆయాసం, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో గత 5 రోజులుగా ఏలూరు ఆసుపత్రిలో ఉంటున్నాం. ఇంకా ఆయాసం తగ్గలేదు. భయంగా ఉంది.
శిరోమణి, కొమ్మర, ద్వారకాతిరుమల మండలం
మద్యంతో అన్నీ అనర్థాలే
మద్యపానంతో కాలేయం దెబ్బతిని ..నరాలు బలహీన పడి ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. కామెర్లు వచ్చే అవకాశం ఉంది. మూత్ర పిండాలు పని చేయవు. అధికంగా మద్యం తాగితే పేగులకు పూత, పుండ్లు సమస్యల తో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. కడుపులో మంటతో ఇబ్బంది పడటం, వాంతులు చేసుకోవటం వంటి ఇబ్బంది ఉంటుంది. ఈ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య గత కొంత కాలంగా బాగా పెరిగింది.
రవికుమార్, ఏలూరు వైద్య కళాశాల వైద్య నిపుణుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం