ఇదేనా మహిళా సాధికారత.. జగన్
మహిళల్లో మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నరసాపురంలో ఏర్పాటుచేసిన లేస్పార్కును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం
లేస్పార్కుపై వైకాపా మార్కు నిర్లక్ష్యం
హామీ ఇచ్చి వదిలేసిన వైనం
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడమే మా లక్ష్యం. నరసాపురంలో చేతి అల్లికల అక్కచెల్లెమ్మలను ఆదుకుంటాం. చేనేత, కలంకారి వృత్తిలో ఉన్నవారికి ఇచ్చినట్లే వీరికి ప్రతినెలా రూ.2 వేలు పెట్టుబడి రాయితీ ఇస్తాం.
ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో జగన్మోహన్రెడ్డి మాటలివి. అధికారంలోకి వచ్చాక కనీసం దానివైపు చూసిన పాపాన పోలేదు.
ఈనాడు డిజిటల్, భీమవరం, నరసాపురం, న్యూస్టుడే
నరసాపురంలోని లేస్పార్కు
మహిళల్లో మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నరసాపురంలో ఏర్పాటుచేసిన లేస్పార్కును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఎంతోమంది మహిళలు స్వయం ఉపాధికి దూరమయ్యారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే చేతి అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దాదాపు 2వేల కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవించేవి. ఇందులో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది వరకు ఉండేవారు.
మరి నేడు..
పరిశ్రమను, దానిమీద ఆధారపడి జీవిస్తున్న వారిని వైకాపా ప్రభుత్వం నిలువునా ముంచిందని, ఇదేనా మహిళా సాధికారతని వనితలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ప్రారంభించారు. అనుసంధానంగా 50 సొసైటీలు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత తెదేపా హయాంలోనూ ఓ వెలుగు వెలిగింది. మహిళలకు అల్లికల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, శ్రమకు తగిన ఫలితం దక్కేందుకు వీలుగా డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు అలంకృతి మినీ లేసుపార్కుల పేరిట భవనాలు నిర్మించారు. ఆధునిక లేసు కుట్టు యంత్రాలను సైతం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ అలంకారప్రాయంగా మారాయి. అల్లికలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్న శిక్షణ తప్ప ఇక్కడ ఏ విధమైన ఉపాధి కార్యక్రమాలు లేవు.
ఆదరించడంలో విఫలం
వైకాపా పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మహిళలకు శిక్షణ మాట అటుంచితే ... లేసులకు మార్కెటింగ్, గిట్టుబాటు కూలీ లభించేలా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నరసాపురం డివిజన్లో అధిక శాతం మహిళలకు లేసుË అల్లికలే ప్రధాన ఆదాయ వనరు. ఈ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఇంటి పట్టునే ఉంటూ లేసులు అల్లడం ద్వారా కొద్దిపాటి ఆదాయం పొందేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు.
పన్నుల మోత
లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో సుంకాలు ఉండేవి కావు. లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. గతంలో ఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఎగుమతులు లేకపోవడంతో పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతిదారులు కోరుతున్నారు.
ఇంటి పట్టునే ఉండి..
‘దారంతో లేసుఅల్లికలు పూర్వం నుంచీ ఉన్నాయి. నేను నా కుటుంబ సభ్యులద్వారా లేసు అల్లికలు నేర్చుకున్నా. గతంలో ఇంటి పట్టున ఉండే మాలాంటి వారికి లేసు అల్లికలు ఆదాయమార్గంగా ఉండేవి. నూతన విధానాలతో మాకు ఉపాధి కరవైంది. వాటిపై శిక్షణ ఇస్తే మాకు ఉపాధి దొరకడంతోపాటు భవిష్యత్తు తరాలకు ఈ కళను అందించేందుకు అవకాశం ఉంటుంది’ అని మొగల్తూరుకు చెందిన ఎ.సత్యవతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం