logo

నేడు ఉండిలో ప్రజాగళం సభ

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండిలో శుక్రవారం ఉదయం ప్రజాగళం సభలో పాల్గొంటారు.

Published : 10 May 2024 04:13 IST

తెదేపా అధినేత చంద్రబాబు రాక

ఉండి, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండిలో శుక్రవారం ఉదయం ప్రజాగళం సభలో పాల్గొంటారు. సభ నిర్వహణకు ఉండిలో ప్రధాన వంతెన కూడలి వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఈ పనులను  పర్యవేక్షించారు.  భీమవరంలోని వీఎస్‌ఎస్‌ గార్డెన్‌ సమీపాన హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీ నాయకులతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు.

భీమవరంలో హెలిప్యాడ్‌ను పరిశీలిస్తున్న  ఎమ్మెల్యే రామరాజు, నాయకులు

పర్యటన ఇలా.. చంద్రబాబు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్‌లో భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో ఉండి ప్రధాన వంతెన కూడలిలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభలో తెదేపా పొలిట్‌ సభ్యురాలు తోట సీˆతారామలక్ష్మి, నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజుతో పాటు తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనాయకులు పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జరిగే సభకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సుమారు 10 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరాజు తెలిపారు. ఉండి ప్రధాన వంతెన కూడలిని గురువారం సాయంత్రం పోలీసు అధికారులు పరిశీలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు