రేపటి నుంచి జిల్లాలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’: తెదేపా
జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు.
మాట్లాడుతున్న లింగారెడ్డి, పక్కన నాయకులు
ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్టుడే: జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు కార్యకర్తలు, అనుబంధ కమిటీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, మద్య నిషేధం, విద్యుత్తు, ఇసుక, అభివృద్ధిలేని పరిస్థితులపై ప్రజాభిప్రాయాలు సేకరిస్తామన్నారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదన్నారు. సొంత అన్న సీఎంగా ఉండగా న్యాయం జరగక పోగా వివేకా కుమార్తెకు బెదిరింపులు కేసుకు అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. తెలంగాణలోనైనా కేసు సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని డిమాండు చేస్తున్నామన్నారు. నాయకులు సిద్దయ్య, గురప్ప పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్