logo

కారు, మినీ లారీ ఢీకొని కోళ్ల మృతి

కడప-రాయచోటి రహదారిపై ఆర్టీవో కార్యాలయం సమీపంలో శనివారం కారు, మినీ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

Published : 29 Jan 2023 04:01 IST

బోల్తా పడిన లారీ, మృతి చెందిన కోళ్లు

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : కడప-రాయచోటి రహదారిపై ఆర్టీవో కార్యాలయం సమీపంలో శనివారం కారు, మినీ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మినీలారీలోని వంద కోళ్లు మృతి చెందాయి. మదనపల్లె నుంచి కోళ్లను తీసుకొస్తున్న మినీ లారీ, డివైడర్‌ పక్క నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. మినీ లారీ బోల్తా పడి వంద కోళ్లు మృతి చెందాయి. మినీ లారీ అదుపుతప్పినప్పుడు విద్యుత్తు స్త్తంభాన్ని ఢీకొనడంతో మూడు స్తంభాలు విరిగిపోయాయి. కేవీకే, రింగ్‌ రోడ్డు కాలనీలోని ప్రజలకు సాయంత్రం వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని