logo

విజయదుర్గాదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కడప నగరంలో బిల్టప్‌ సమీపంలో ఉన్న విజయదుర్గాదేవి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

Published : 04 Feb 2023 05:05 IST

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్న  నిర్వాహకులు దుర్గాప్రసాద్‌ దంపతులు

మారుతీనగర్‌ (కడప), న్యూస్‌టుడే : కడప నగరంలో బిల్టప్‌ సమీపంలో ఉన్న విజయదుర్గాదేవి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. శుక్రవారం ఆలయ యాగ మండపంలో ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్‌ దంపతులతో గణపతిపూజలు చేయించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఆలయం వద్ద విద్యుత్తు దీపాలంకరణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని