విద్యుత్తు వినియోగదారులపై... మరో బాదుడు!
‘ఏ జన్మలో చేసుకున్న పాపమో అనుభవిస్తున్నాం.’ అనే మాటలు తరచూ వింటుంటాం. ప్రస్తుతం విద్యుత్తు బిల్లులు చూసి వినియోగదారులు ‘ ఎవరో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు మేము కష్టాలు అనుభవిస్తున్నాం’ అంటూ ఏకరవు పెడుతున్నారు.
ట్రూఅప్తోపాటు ఎఫ్పీపీసీఏ కింద అదనపు భారం
ఈనాడు డిజిటల్, కడప
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఓ వినియోగదారుడికి బుధవారం జారీ అయిన బిల్లులో ట్రూ అప్ ఛార్జీల కింద రూ.25.82 పైసలు పేర్కొనగా, ఎఫ్పీపీసీఏ కింద రూ.28.04 పైసలు అదనంగా భారం మోపారు.
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో కిరాణా దుకాణం నడుపుతున్న ఓ వ్యాపారికి ఏకంగా ఎఫ్పీపీసీఏ కింద రూ.870 విధించారు. ట్రూ అప్ ఛార్జీల కింద రూ.1,200 భారం పడింది. దుకాణం నడవడం అంతంతమాత్రంగా ఉండగా, విద్యుత్తు ఛార్జీల భారం భారీగా పెరిగిందంటూ వ్యాపారి లబోదిబోమంటున్నారు.
‘ఏ జన్మలో చేసుకున్న పాపమో అనుభవిస్తున్నాం.’ అనే మాటలు తరచూ వింటుంటాం. ప్రస్తుతం విద్యుత్తు బిల్లులు చూసి వినియోగదారులు ‘ ఎవరో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు మేము కష్టాలు అనుభవిస్తున్నాం’ అంటూ ఏకరవు పెడుతున్నారు. సాధారణంగా నెల ప్రారంభం నుంచి విద్యుత్తు వినియోగదారులకు బిల్లుల జారీ జరుగుతుంది. ఈ మేరకు ఏప్రిల్కు సంబంధించిన విద్యుత్తు వినియోగ బిల్లులను ఎస్పీడీసీఎల్ మంగళవారం నుంచి జారీ చేస్తోంది. బిల్లును చూసి ప్రతి వినియోగదారుడు షాక్కు గురవుతున్నారు. గతంలో ట్రూఅప్ ఛార్జీలే భారంగా అనిపిస్తుండగా తాజాగా ఎఫ్పీపీసీఏ పేరిట మరో భారం బిల్లులో కనిపిస్తోంది. అన్ని రకాల సర్వీసులపై ఈ భారం స్పష్టంగా కనిపిస్తోంది. బిల్లు చేతిలోకి తీసుకున్న వినియోగదారులు లబోదిబోమంటూ ఇతరులకు చూపిస్తూ ఈ భారమేంటో తెలపాలంటూ ఆరా తీయడం సర్వత్రా కనిపిస్తోంది.
విద్యుత్తు బిల్లులో ఎఫ్పీపీసీఏ పేరిట అదనపు ఛార్జీ
ఎఫ్పీపీఎస్ఏ అంటే?
ఇంధనం, విద్యుత్తు కొనుగోలు ఖర్చు సర్దుబాటు(ఎఫ్పీపీసీఏ)గా ఎస్పీడీసీఎల్ బిల్లులో ప్రత్యేక కాలంగా పేర్కొని ఛార్జీ విధిస్తోంది. గత నెల వరకు జారీ అయిన బిల్లులో వినియోగించుకున్న యూనిట్లకు ఛార్జీతో పాటు స్థిర ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ట్రూ అప్ ఛార్జీలు విధిస్తుండగా తాజాగా ఎఫ్పీపీసీఏ ఛార్జీల పేరిట అదనంగా ఈ నెల నుంచి మరో 12 నెలల పాటు వినియోగదారులపై బాదనున్నారు. రానున్న రోజుల్లో ఈ భారం మరింత పెరగనుంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట ఉమ్మడి కడప జిల్లాలో రూ.210 కోట్లను విద్యుత్తు వినియోగదారుల నుంచి ఎస్పీడీసీఎల్ వసూలు చేయనుంది. 2014 నుంచి 2019 మధ్య అయిదేళ్లపాటు వినియోగించిన విద్యుత్తుకు సర్దుబాటు ఛార్జీలు ట్రూ అప్ పేరిట వసూలు చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వినియోగదారులపై భారం పడుతుండగా, తాజాగా మరో 12 నెలల పాటు అదనపు భారం మోపనుంది. విద్యుత్తు కొనుగోలు అంచనాలు, వాస్తవ విద్యుత్తు కొనుగోలు భారం పెరిగిన కారణంగా అదనపు భారం పడిందని.. ఈ మొత్తాన్ని రాబట్టేందుకు వినియోగదారుల నుంచి వసూలుకు అనుమతించాలని ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. దీనిపై విచారించిన ఈఆర్సీ 2021-22లో అప్పటి వినియోగం ఆధారంగా 2024, మార్చి వరకు బిల్లులో కలిపి డిస్కంలు వసూలుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఎఫ్పీపీసీఏ పేరిట అదనపు భారం వినియోగదారులపై పడింది. ఓ వైపు ట్రూఅప్, మరో వైపు ఎఫ్పీపీసీఏ పేరిట వినియోగదారులపై బాదేస్తున్నారు. అద్దె భవనాల్లో ఉన్న వారైతే ఎవరో వాడుకున్న కరెంటుకు మేమెందుకు బిల్లు చెల్లించాలంటూ యజమానులతో వాదనకు దిగుతున్నారు. కొందరు సర్దుబాటు చేసుకుంటుండగా, మరికొన్నిచోట్ల వాగ్వాదాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారం ఇటు అన్నమయ్య, అటు వైయస్ఆర్ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వినియోగదారులపై దొంగ దెబ్బ కొడుతోందని వినియోగదారులు నిష్ఠూరపోతున్నారు.
గృహ సర్వీసులు - 9,05,066
వాణిజ్య - 93,482
పరిశ్రమలు - 686
కుటీర పరిశ్రమలు - 6,400
వీధి దీపాలు, తాగునీటి పథకాలు - 8,996
ఇతరాలు - 7,222
వ్యవసాయ సంబంధిత - 1,82,718
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనలకు పాతర... ఇసుకాసురుల జాతర..!
[ 17-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండి పడింది. -
బద్వేలులో భూఆక్రమణ!
[ 17-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన ఎకరా విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల కన్ను పడింది. -
వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
[ 17-05-2024]
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. -
నిప్పులార్పగలరు... భవనాలూ నిర్మించగలరు
[ 17-05-2024]
దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలిస్తాయి. వీటిని ఆయుధాలుగా చేపట్టిన వారు విజయాలను సాధిస్తారనే స్వామి వివేకానందుడి సూక్తిని నిజం చేశారు ప్రొద్దుటూరు అగ్నిమాపక, విపత్తుల శాఖలో ఫైర్మెన్గా పని చేసే ఒ.నరేంద్రకుమార్. ఉద్యోగం రాకముందు బేల్దారి పని చేసి జీవించేవారు. -
సీఎం బటన్ నొక్కినా జమకాని నగదు
[ 17-05-2024]
సీఎం జగన్ వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా నిధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. -
ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
[ 17-05-2024]
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. -
మండిపల్లి గృహనిర్బంధం
[ 17-05-2024]
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని పోలీసులు ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో
[ 17-05-2024]
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు