logo

గోప్యంగా సునీత ప్రచారం!

మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె..

Published : 24 Apr 2024 03:38 IST

నేతలకు వేధింపుల కారణంగా నిర్ణయం

తెదేపా నేత అమీర్‌బాబును కలిసిన వివేకా కుమార్తె సునీత తదితరులు

ఈనాడు, కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. వైకాపా వేధింపులను దృష్టిలో పెట్టుకుని వారి వివరాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన తండ్రి వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా న్యాయం జరగలేదంటూ ప్రజాకోర్టులో తేల్చుకోవాలనే అభిప్రాయానికి వచ్చి పోరాడుతున్నారు. షర్మిలను ఎంపీ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే హత్యకు గురయ్యారని.. చివరి కోరిక మేరకు పీసీసీ అధ్యక్షురాలిని కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని పార్టీలకతీతంగా ఆమె కోరుతున్నారు. ప్రత్యేకించి తన తండ్రితో అనుబంధం ఉన్న నేతలతో పాటు వైకాపా నాయకులను ప్రత్యేకంగా కలుస్తున్నారు. వివేకా హత్య, తదనంతర పరిణామాలు, నిందితులను సీఎం జగన్‌ కాపాడు తున్నారని, తన అధికారాన్ని వాడుకుంటూ న్యాయం జరగకుండా చేస్తున్న కుట్రలను వివరిస్తున్నారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ న్యాయం, ధర్మాన్ని ప్రస్తావిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల గెలుపు కోసం కడప పార్లమెంటు పరిధిలో తన ప్రయత్నాలు సునీత ముమ్మరంగా సాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని