ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
హేతుబద్ధీకరణ పేరిట 800 ఉపాధ్యాయ పోస్టులకు మంగళం
డీఎస్సీలో తక్కువ ఖాళీలు చూపి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
న్యూస్టుడే, కడప విద్య
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో యువత ఉద్యోగాల్లేక ఆవేదన చెందుతున్నారు. వైకాపా ప్రభుత్వ చర్యలతో డీఎస్సీలోనూ జిల్లా నుంచి తక్కువ ఖాళీలు చూపాల్సిన పరిస్థితి నెలకొంది. నమ్మకద్రోహంతో వందల పోస్టులు రద్దు చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల పోస్టుల క్రమబద్ధీకరణ తదితర చర్యలతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అధిక సంఖ్యలో మిగులు పోస్టులు చూపింది. ఉన్నత పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేసి మూడో తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ ప్రచారం చేసింది. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో 1,800 ఎస్జీటీ పోస్టులను సర్ప్లస్ పోస్టులుగా గుర్తించారు. వాటిల్లో 1,000 పోస్టులు ఖాళీవి కాగా, 800 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం వివిధ రూపాల్లో వినియోగించుకోవాల్సిన జాబితాలో ఉంచారు. అదే సమయంలో అటు ఉపాధ్యాయులను, ఇటు నిరుద్యోగులను ఆందోళన కలిగించేవిధంగా ప్రభుత్వం నూతన జీవోలను తీసుకొచ్చింది. వీటివల్ల ఆయా జిల్లాల్లో కొత్త పోస్టుల భర్తీ పక్కనబెట్టి, ఏ జిల్లాలో ఎన్ని రద్దయ్యాయి అని రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జీవో 155తో ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగా 113 సర్ప్లస్ ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత ఉద్యోగోన్నతులలో భాగంగా సర్ప్లస్ ఎస్జీటీ విభాగంలోని 800 మందిలో స్కూల్అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్న పోస్టులనూ ఇదే విధంగా రద్దుచేసింది. రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకుని కర్నూలు జిల్లాలో స్కూల్అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థికశాఖ ఆమోదం పొందేందుకు ఇలా చేశారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా సుమారు 800 పోస్టులు రద్దయ్యాయి.
ఇక్కడ బదలాయించకుండా పక్క జిల్లాకు..
రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా విద్యార్థుల సంఖ్య లేదనే కారణంతో ఎస్జీటీ పోస్టులు భారీగా రదు ్దచేశారు. ఉమ్మడి కడప జిల్లాలో రద్దు చేసిన సుమారు 800 పోస్టులను, ఇక్కడే విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు బదలాయించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కర్నూలు జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా మంజూరు చేయాల్సిన పోస్టులకు బదలాయింపు చేశారు. దీంతో అక్కడ వాటి సంఖ్య భారీగా పెరిగింది. ఇక్కడ మాత్రం తగ్గిపోయింది. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో అంతకుముందు 400 వరకు ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు 700కు చేరాయి. ఈ నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు నాన్చి డీఎస్సీ ప్రకటించింది. పెద్ద ఎత్తున పోస్టులుంటాయని నిరుద్యోగులు ఆశిస్తే తక్కువ ఖాళీలు చూపడంతో విస్మయానికి గురయ్యారు. జగనన్న ప్రభుత్వం తమను వంచిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం