ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు.
అయిదేళ్లలో కలగానే కనీస సదుపాయాలు
కొత్తకోటను నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కారు
రోడ్డు వసతి లేని బి.కొత్తకోట శివార్లలోని పెయింటర్ల కాలనీలోని వీధి
బి.కొత్తకోట, న్యూస్టుడే: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. బెంగళూరు రోడ్డులోని పెయింటర్ల కాలనీని అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అయిదేళ్లలో పెయింటర్ల కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులు ఏవీ లేకపోవడమే దీనికి నిదర్శనం. పట్టణంలో భవనాలకు సున్నంతో పాటు రంగులు వేసుకుని జీవిస్తున్న కార్మికులు అధికంగా ఉన్నారు. 2002లో వీరి కోసం అప్పటి తెదేపా ప్రభుత్వం గృహ నిర్మాణ కాలనీని ఏర్పాటు చేసింది. క్రమంగా ఈ కాలనీ విస్తరించి ఇక్కడే ఆదర్శ ప్రభుత్వ విద్యాలయం, వసతి గృహాలను ప్రభుత్వం నిర్మించింది. ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతామని వారంతా స్పష్టం చేస్తున్నారు.
- బి.కొత్తకోట-బెంగళూరు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పెయింటర్ల కాలనీలో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టలేకపోయారు. సిమెంటు రోడ్ల మాట దేవుడెరుగు... కనీసం మట్టి రహదారులకు రూపురేఖలు ఏర్పడలేదు. మురుగు కాలువల నిర్మాణం ఊసే లేకుండా పోయింది. ఇళ్ల మధ్యన మురుగు నిల్వలతో దోమల బెడద నానాటికీ అధికమవుతోంది. తాగునీటి సరఫరా కోసం బోరును వేసి కొన్ని ఇళ్లకు డైరెక్టు పంపింగ్ ద్వారా నీళ్లు ఇస్తున్నారు. మిగిలిన కుటుంబాలు పైపులైను వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం ట్యాంకరుతో నీళ్లు తెప్పించుకుంటున్నారు. ఈ కాలనీలో ఓవర్హెడ్ ట్యాంకును నిర్మించి నీటిని ఇళ్లకు సరఫరా చేయాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు వీధిలైట్లు లేకపోవడంతో కాలనీలో అంధకారం అలుముకుంటోంది. కాగా ఇదే కాలనీని ఆనుకుని బీరంగి రెవెన్యూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వేధిస్తున్న పాముల బెడద
తాగునీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేలా పైపులైన్లను వేయించాలి. పాముల బెడద అధికంగా ఉండటంతో భయాందోళనలకు గురవుతున్నాం. వీధిలైట్లు వేయించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
టి.రమణమ్మ, పెయింటర్ల కాలనీ
కన్నెత్తి చూడని పాలకులు
కనీస సదుపాయాలు లేకపోవడంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసిన తర్వాత పునాదులు వేసి వెళ్లిపోయారు. తాగునీరు, రోడ్లు, వీధిలైట్ల సదుపాయాన్ని కల్పించాలని ఎందరిని కోరినా ఫలితం లేకుండా పోయింది.
బి.బావాజీ, పెయింటర్ల కాలనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలేటివాగులో కాలనాగులు
[ 18-05-2024]
ప్రతిష్ఠాత్మకమైన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఉండగా, దీనికి సమాంతరంగా మరొక దానిని ప్రతిపాదించి రూ.వేల కోట్లతో పనులు చేపట్టారు. కాలేటివాగు ప్రాజెక్టు ప్రతిపాదనపై ఆది నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం కొల్లకొట్టడానికే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారంటూ విపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. -
పోలీసు విధుల్లో కొరవడిన ‘చైతన్య’ం!
[ 18-05-2024]
తాడిపత్రికి స్పెషల్ డ్యూటీ పేరిట అర్ధరాత్రి పూట వెళ్లి జేసీ ప్రభాకర్రెడ్డి ఇంట్లోని పనివాళ్లను విచక్షణారహితంగా కొట్టడం... ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం... దివ్యాంగుడైన కంప్యూటరు అపరేటర్ కిరణ్ తల పగలుకొట్టడం... ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి మరింతగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం. -
పురజనుల కష్టాలు చూస్తేనే జలదరింపు!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
ఆ ముగ్గురిని జిల్లా దాటించారు!
[ 18-05-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుశాఖ డేగ కళ్లలో నిఘా పెట్టింది. -
జయజయధ్వానాలతో మార్మోగిన బ్రహ్మంగారిమఠం
[ 18-05-2024]
భక్తులు జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై అనే నామస్మరణతో బ్రహ్మంగారి మఠ ఆవరణ మారుమోగింది. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం, ఆరాధన గురు పూజా మహోత్సవంలో శుక్రవారం స్వామి వారు దీక్షా బంధన ఆలంకారోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
డబ్బులుంటేనే దప్పిక తీరేది!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
అగ్నిమాపక శాఖలో అసౌకర్యాల మంట
[ 18-05-2024]
అగ్ని ప్రమాదం చోటు చేసుసుకుంటే వెంటనే మంటలు ఆర్పేయాలి.. లేకుంటే ఆస్తి నష్టం జరుగుతుంది. ఒక్కో సారి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చిన్నపాటి మంటలు చెలరేగినా అధిక ఉష్ణోగ్రతలతో ఈదురు గాలుల తీవ్రతతో క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తున్నాయి. -
ఇసుకాసురులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
[ 18-05-2024]
ఇసుకాసురులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ డిమాండ్ చేశారు. శుక్రవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న గుర్రంకొండ మండలంలోని తరిగొండ రామానాయుడు చెరువును పరిశీలించారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి
[ 18-05-2024]
ట్యాంకు నుంచి తమ ఇంటికి ఏర్పాటు చేసుకున్న తాగునీటి పైపును వైకాపా నేతలు అకారణంగా కోసేశారని... ఎందుకు ఇలా చేశారని అడిగిన పాపానికి మూకుమ్మడిగా దాడి చేశారని చిన్నమండెం మండలం మల్లూరు క్రాస్కు చెందిన తెదేపా కార్యకర్త కదిరి చిన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి
[ 18-05-2024]
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేశాపురం గ్రామం గుట్టమోటు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీల మృతి
[ 18-05-2024]
వడదెబ్బకు గురై ఇద్దరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో మృతి చెందారు. రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె పంచాయతీ బంగ్లామిట్టకు చెందిన పాలెంకోట వెంకటేషు (55) శుక్రవారం గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పని చేస్తుండగా ఎండ తీవ్రతకు తాళలేక కుప్పకూలిపోయారు. -
మదనపల్లెలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం
[ 18-05-2024]
మదనపల్లె మండలంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం నుంచి ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం జరగనున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మదనపల్లెకు రానున్న నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో తనిఖీలు చేపట్టారు.