logo

ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి

అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 01 May 2024 01:36 IST

దొడ్డిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం పీలేరు మండలంలోని దొడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బాబు స్యూరిటటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అధికార మదంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి చేసే దౌర్జన్యాలను, అరాచకాలను తరిమికొట్టాలన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారి చేసింది శూన్యమని చెప్పారు. వైకాపా నాయకులు అధికార అండతో ఇసుక మాఫియా, భూ దందాలు, మట్టి అక్రమ రవాణాతో అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన అన్నారు. పీలేరు మండలంలో తమ కుటుంబం చేసిన అభివృద్ధిని చూసి తమను ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని