ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి
అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు.
దొడ్డిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న నల్లారి కిశోర్కుమార్రెడ్డి
పీలేరు గ్రామీణ, న్యూస్టుడే : అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం పీలేరు మండలంలోని దొడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బాబు స్యూరిటటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అధికార మదంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి చేసే దౌర్జన్యాలను, అరాచకాలను తరిమికొట్టాలన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారి చేసింది శూన్యమని చెప్పారు. వైకాపా నాయకులు అధికార అండతో ఇసుక మాఫియా, భూ దందాలు, మట్టి అక్రమ రవాణాతో అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన అన్నారు. పీలేరు మండలంలో తమ కుటుంబం చేసిన అభివృద్ధిని చూసి తమను ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకాసురుల అరాచకం!
[ 22-05-2024]
ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి శివారు పెన్నానదిలో ఎలాంటి అనుమతుల్లేకుండా వైకాపా నేతలు ఇసుక తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు గత నెలలో తవ్వకాలు నిలిపివేసినా అప్పటికే నదిలో కొన్నిచోట్ల గట్టిమట్టి తేలింది. -
ఆరోగ్యశ్రీ ఆగనుంది!
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. మూడు వేలకుపైగా చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాం!.. వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచామంటూ డప్పు కొట్టుకునే సర్కారు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మాత్రం గుర్తించడంలేదు. -
పశుగ్రాసం... అందక దైన్యం!
[ 22-05-2024]
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. పశుగ్రాసం పెంచడానికి, పంటలు వేయడానికి సాగునీటి వసతి లేకపోవడంతో పొలాలు బీడుగా వదిలేశారు. ఎక్కువగా గొర్రెలు, మేకలు, నాటు జాతికి చెందిన బర్రెలు ఆరు బయట ఉండే గడ్డిపైనే ఆధారపడతాయి. -
వేరుసెనగ విత్తు.. తప్పేనా విపత్తు!
[ 22-05-2024]
ఖరీఫ్ సీజన్లో వర్షాధార భూముల్లో, వ్యవసాయ గొట్టపు బావుల కింద వేరుసెనగ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇటీవల కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవి -
పెద్దేరులో ఇసుకాసురుల పాగా
[ 22-05-2024]
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇసుక రేవులు ఇసుకాసురుల పాలిట బంగారమైంది. జాతీయ రహదారి పక్కన ఇసుక తోడేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. -
జీతాలివ్వండి మహాప్రభో!
[ 22-05-2024]
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న ఉద్యోగులు నెలవారీ కంతులు కట్టేందుకు నానా అవస్థలు పడుతున్నారు. -
కరవు మండలాల్లో ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి
[ 22-05-2024]
జిల్లాలోని కరవు మండలాల్లో ఉపాధిహామీ పనులు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం