విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు
భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు.
రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ధ్వజం
బి.కొత్తకోట షాదీ మహల్లో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ప్రసంగిస్తున్న
రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి
బి.కొత్తకోట, కురబలకోట, న్యూస్టుడే: భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కురబలకోట, బి.కొత్తకోటల్లో జరిగిన రోడ్షోలలో పాల్గొనడంతో పాటు అనంతరం జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ప్రసంగిస్తూ భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లింలకు నష్టం జరుగుతుందని మసీదులకు కరపత్రాలను పంపి భయాందోళనలను సృష్టిస్తున్నారని, ఇలాంటి విష ప్రచారాన్ని మైనార్టీలు నమ్మవద్దని కోరారు. వాస్తవానికి ముస్లింల అభ్యున్నతి కోసం అయిదేళ్ల పాలనలో ముస్లింలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. మైనార్టీలకు ఇస్తున్న నాలుగుశాతం రిజర్వేషన్ కొనసాగుతుందని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించినందువల్ల దీనిపై ఇక ఎలాంటి అనుమానాలకు తావు లేదని వివరించారు. మదనపల్లె, పుంగనూరుల మీదుగా వెళ్లాల్సిన కడప-బెంగళూరు రైల్వేలైనును సీఎం జగన్ పులివెందుల మీదుగా మళ్లించుకుంటే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి నిద్రపోతున్నారా..? అని మాజీ సీఎం ప్రశ్నించారు. భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణాలతో అక్రమ కేసుల బనాయింపులతో రౌడీ రాజ్యాన్ని నడుపుతున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకరనాథరెడ్డిని పుంగనూరుకు తరిమివేయడానికి ఓటును ఆయుధంగా మలుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన మామ కలిచెర్ల ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి చాలా వరకు తాను చేయించానని తెలిపారు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ సంస్ధలను ఇక్కడ నెలకొల్పడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి, భాజపా రాష్ట్ర నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్తాజ్, భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్,పోల్ మేనేజ్మెంటు సమన్వయకర్త కుడుం శ్రీనివాసులు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ సాయినాథ్లతో పాటు వివిధ మండలాల ఎన్డీఏ నాయకులు ఇందులో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకాసురుల అరాచకం!
[ 22-05-2024]
ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి శివారు పెన్నానదిలో ఎలాంటి అనుమతుల్లేకుండా వైకాపా నేతలు ఇసుక తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు గత నెలలో తవ్వకాలు నిలిపివేసినా అప్పటికే నదిలో కొన్నిచోట్ల గట్టిమట్టి తేలింది. -
ఆరోగ్యశ్రీ ఆగనుంది!
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. మూడు వేలకుపైగా చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాం!.. వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచామంటూ డప్పు కొట్టుకునే సర్కారు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మాత్రం గుర్తించడంలేదు. -
పశుగ్రాసం... అందక దైన్యం!
[ 22-05-2024]
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. పశుగ్రాసం పెంచడానికి, పంటలు వేయడానికి సాగునీటి వసతి లేకపోవడంతో పొలాలు బీడుగా వదిలేశారు. ఎక్కువగా గొర్రెలు, మేకలు, నాటు జాతికి చెందిన బర్రెలు ఆరు బయట ఉండే గడ్డిపైనే ఆధారపడతాయి. -
వేరుసెనగ విత్తు.. తప్పేనా విపత్తు!
[ 22-05-2024]
ఖరీఫ్ సీజన్లో వర్షాధార భూముల్లో, వ్యవసాయ గొట్టపు బావుల కింద వేరుసెనగ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇటీవల కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవి -
పెద్దేరులో ఇసుకాసురుల పాగా
[ 22-05-2024]
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇసుక రేవులు ఇసుకాసురుల పాలిట బంగారమైంది. జాతీయ రహదారి పక్కన ఇసుక తోడేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. -
జీతాలివ్వండి మహాప్రభో!
[ 22-05-2024]
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న ఉద్యోగులు నెలవారీ కంతులు కట్టేందుకు నానా అవస్థలు పడుతున్నారు. -
కరవు మండలాల్లో ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి
[ 22-05-2024]
జిల్లాలోని కరవు మండలాల్లో ఉపాధిహామీ పనులు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం