logo

ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగురవేస్తాం

ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు.

Published : 01 May 2024 01:47 IST

పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులురెడ్డి, నాయకులు

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాకిరేనిపల్లెలో 40 కుటుంబాలు తెదేపాలో చేరాయి. మంగళవారం వారందరికీ ఆయన పార్టీ కండువాకప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తెదేపా ప్రభుత్వంకోసం ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు విజన్‌తో రాష్ట్రంలో మంచి రాజధాని వస్తుందని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సమపాళ్లలో జరుగుతాయన్నారు. నాయకులు ఉండెల కొండారెడ్డి, బయ్యపురెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, జయరామిరెడ్డి, రామశేఖర్‌రెడ్డి, ద్వార్శల వెంకటసుబ్బారెడ్డి, పోకల పవన్‌కుమార్‌రెడ్డితో పాటు 40 కుటుంబాలు తెదేపాలో చేరాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని