మైదుకూరు అభివృద్ధిపై నోరెత్తని జగన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు.
న్యూస్టుడే, మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చాపాడు, బ్రహ్మంగారిమఠం
ఆర్టీసీ బస్టాండు వద్ద వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు. ముఖ్యమంత్రి వచ్చారంటే హామీలు గుప్పిస్తారంటూ ఆశించిన ప్రజలు నిరుత్సాహపడ్డారు. తెలుగుగంగ స్థిరీకరణకు కుందూనది నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఎత్తిపోతల పథకం విషయంలో నోరుమెదపలేదు. బిల్లులు చెల్లించకపోవడంతో ఆగిపోయిన అభివృద్ధి పనులపైనా మాట్లాడలేదు. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో కేసీ కాలువ, తెలుగుగంగ ప్రధానం కాగా, వాటి ఊసే ఎత్తలేదు. తిరిగి అధికారంలోస్తే నియోజక వర్గానికి ఏం చేయబోతామో అనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న పథకాలు, బటన్ నొక్కుడు కార్యక్రమాలపై గొప్పలు చెప్పుకొన్నారే కానీ నిధులు మంజూరు చేయక నిలిచిపోయిన నాడు-నేడు పనుల విషయాన్ని ప్రస్తావించలేదు. చంద్రబాబుతోపాటు కూటమి, కాంగ్రెస్ పార్టీల నాయకులతోపాటు పత్రికలు, ఛానళ్లపై విమర్శలు చేశారు. చివరిలో ఎమ్మెల్యే రఘునాథరెడ్డి, ఎంపీ అవినాష్రెడ్డిలు సైతం మాట్లాడకపోవడంతో ప్రజలు వెనుతిరిగారు. జగన్ రాక ఆలస్యం కావడంతో మండుటెండలో జనం అల్లాడిపోయారు. ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడికి వెళ్లి తలదాచుకోవడం కనిపించింది. జగన్ బస్సుపైకి చేరగానే రోడ్డుపైకి చేరుకున్నారు. జగన్ ప్రసంగిస్తున్న 8 నిమిషాలకే ప్రజలు వెనుతిరగడం కనిపించింది. సీఎం ప్రసంగం పూర్తయ్యే సరికి ఆప్రాంతం సగం ఖాళీ కావడం గమనార్హం.
అన్నం పొట్లాల కోసం ఆటో చుట్టూ చేరిన పోలీసులు
పెరిగిన పోలీసుల నిఘా : సీఎం జగన్పై గులకరాయి దాడి ఘటనతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మేడలపై జనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మిద్దెలు నివాసం ఉంటున్న వారిని సైతం మేడపైకి రాకుండా చూసుకున్నారు. ప్రొద్దుటూరు రోడ్డులో ప్రతి ఇంటిపైనా పోలీసులను ఏర్పాటు చేశారు. రెండు అంతస్తులుంటే పైన కింద సిబ్బందిని నియమించి నిఘా పెట్టారు. ఎప్పుడూలేనిది మేడలపైకి చేరకుండా పోలీసులు తీసుకున్న చర్యలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికులు, వాహనదారుల పాట్లు: ఎన్నికల ప్రచారô కోసం సీఎం జగన్ మైదుకూరు రాకతో పోలీసులు పట్టణాన్ని దిగ్బంధం చేశారు. పట్టణంలోని నాలుగురోడ్లలోనూ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహన రాకపోకలు అడ్డుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు 12.45 గంటలకు సీఎం మైదుకూరు చేరుకుంటారని ప్రచారం జరిగినా రహదారులపైకి చేరుకున్న పోలీసులు ఉదయం 10 గంటలకే బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. రాకపోకలను అడ్డుకోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీఎం జగన్ ఎన్నికల ప్రచార బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చింతలపల్లెలో పోలీసుల కవాతు
[ 21-05-2024]
మండలంలోని చింతలపల్లిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మంగళవారం పోరుమామిళ్ల సీఐ చిరంజీవి, ఎస్సై నాగమురళి, పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. -
అదును చూసి... ఆక్రమించేసి..!
[ 21-05-2024]
గత కొన్ని నెలలుగా అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సమయంలో ఇదే అదునుగా ఆక్రమార్కులు రెచ్చిపోయారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. వీరికి కొందరు రెవెన్యూ శాఖాధికారులు పరోక్షంగా సహకరించారు. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు!
[ 21-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష కార్యకర్తల తలలు పగలకొడుతూ.. వారి ఏజెంట్లను ఎత్తుకుపోతూ వైకాపా నాయకులు భయానక వాతావరణం సృష్టించగా పోలీసులు నిద్రపోయారు. -
అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టేది?
[ 21-05-2024]
మదనపల్లె పట్టణంలో జరుగుతున్న భవన నిర్మాణాల్లో యజమానులు పట్టణ ప్రణాళిక నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై పురపాలక సంఘం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
పేలుళ్లపై ఆందోళన
[ 21-05-2024]
మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని గుట్టలో అక్రమంగా పేలుళ్లకు పాల్పడుతూ స్థలాలను చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఐటీయూసీ నాయకుడు కృష్ణమూర్తి డిమాండు చేశారు. -
బాభౌయ్!
[ 21-05-2024]
రాజంపేట పట్టణంలోని కొలిమి వీధిలో నాలుగు నెలల కిందట ఓ చిన్నారిని ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో 15 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయట పడింది. -
జలం జారిపోతోంది!
[ 21-05-2024]
జిల్లాలో తీవ్ర వర్షాభావం పరిస్థితులతో భూగర్భ జలాలు పాతాళం వైపు పరుగులు తీస్తున్నాయి. వ్యవసాయ, తాగునీటి గొట్టపు బావులు ఒట్టిపోతున్నాయి. మడుగులు, కుంటలు, చెరువులు నోరెళ్ల బెట్టాయి. బావులు తడారిపోయాయి. -
వెల్లాలలో వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం
[ 21-05-2024]
రాజుపాళెం మండలం వెల్లాల శ్రీచెన్నకేశవ, సంజీవరాయునిస్వామి, భీమలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శ్రీచెన్నకేశవ, శ్రీదేవి, భూదేవిల కల్యాణం వైభవంగా జరిగింది. -
మంగంపేట గనుల్లో చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే చర్యలు
[ 21-05-2024]
మంగంపేట ముగ్గురాయి గనుల్లో చట్ట విరుద్ధ పనులకు పాల్పడితే చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ గనుల భద్రత విభాగం డీడీ కోటం నాయుడు హెచ్చరించారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
[ 21-05-2024]
జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ నోడల్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
‘దాడులకు ఉసిగొల్పింది వైకాపా నాయకులే’
[ 21-05-2024]
ఎన్నికల సందర్భంగా కడప గౌస్నగర్లో జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యులు వైకాపా నాయకులేనని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళి ఆరోపించారు. -
చీకట్లో తనిఖీలా!
[ 21-05-2024]
ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి సమీపంలో పెన్నానదిలో అధికారికంగా అనుమతిచ్చిన ఇసుక రేవును అధికారుల కమిటీ బృందం చీకట్లో తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
రైల్ మదద్తో ప్రయాణికుడికి విలువైన వస్తువుల అప్పగింత
[ 21-05-2024]
రైలులో మిస్ అయిన విలువైన వస్తువులను ‘రైల్ మదద్’ సాయంతో సంబంధిత ప్రయాణికుడికి అందించిన ఘటన కడప రైల్వేస్టేషన్లో సోమవారం జరిగింది. -
రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు
[ 21-05-2024]
గొల్లపల్లి గ్రామశివారులో పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నదిలోకి వాహనాలు వెళ్లకుండా గతంలో అధికారులు గుంతలు తవ్వించగా, ఇసుకాసురులు బరితెగించి పూడ్చేశారు.