ఎమ్మెల్యే భూమిపూజ చేసి రెండేళ్లు... పూర్తికి ఇంకెన్నాళ్లు
ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు అగ్నిమాపక శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది.
జమ్మలమడుగులో మురిగిపోయిన రూ.86 లక్షలు
అగ్నిమాపక శాఖ భవన పనులకు గ్రహణం
న్యూస్టుడే, జమ్మలమడుగు
జమ్మలమడుగులో నిధుల్లేక ఆగిన అగ్నిమాపక శాఖ భవన పనులు
ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు అగ్నిమాపక శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో చూస్తే సమస్యలు తిష్ఠవేశాయి. నిధుల లేమితో నూతన భవన నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. ముద్దనూరుకు ఫైర్స్టేషన్ మంజూరైనా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. కొండాపురం, ముద్దనూరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే జమ్మలమడుగు నుంచే పరుగులు పెట్టాల్సి ఉంటుంది. స్థానిక ముద్దనూరు రోడ్డులో 2021, జనవరి 7వ తేదీన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అగ్నిమాపక శాఖ నూతన భవనానికి భూమిపూజ చేశారు. కార్యాలయంతోపాటు రెండు అగ్నిమాపక వాహనాలను నిలుపుకొనేందుకు వీలుగా, ఇతర గదుల కోసం సుమారు రూ.86 లక్షలు కేటాయించారు. అక్కడి భూమిని పరిశీలించిన అనంతరం పనులు మొదలయ్యాయి. పునాదులు దాటి గోడల నిర్మాణ సమయంలో పనులు కుంటుపడ్డాయి. నిధుల లేమితో చాలా కాలంగా పనులు ఆగిపోయాయి.
పెచ్చులూడి పడుతుంటే భయం భయంగా సిబ్బంది విధులు
1962లో నిర్మించిన పాత భవనంలోనే అగ్నిమాపకశాఖ కార్యాలయం నేటికీ కొనసాగుతోంది. అప్పుడప్పుడూ పైనుంచి పెచ్చులూడి పడుతుంటే సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మలమడుగు ఫైర్స్టేషన్ పరిధిలో జమ్మలమడుగుతోపాటు మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు, కొండాపురం మండలాలు ఉండేవి. కొత్తగా ముద్దనూరుకు ఫైర్స్టేషన్ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాడిపత్రి రోడ్డులో స్థలం ఎంపిక చేసినా పనులు మొదలు కాలేదు. ఇప్పటి వరకు ఆ రెండు మండలాల్లో ఏవైనా అగ్నిప్రమాదాలు జరిగితే జమ్మలమడుగు సిబ్బంది వెళ్లి ఆర్పాల్సి ఉంటుంది. అక్కడి గ్రామాలు 20 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉండడంతో అంతదూరం చేరుకునే లోగా నష్టం జరిగిపోతుంది కావున ముద్దనూరులో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేసి జమ్మలమడుగులో నూతన భవనానికి నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల ముద్దనూరు మండలంలో అగ్నిప్రమాదాలు జరిగాయి. గడ్డివాములు, చక్కడిపోలో మంటలు వ్యాపించగా జమ్మలమడుగు నుంచి ఫైర్ ఇంజిన్ వెళ్లి ఆర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతదూరం వెళ్లేసరికి నష్టం జరిగిపోయిందని బాధితులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా