వర్షాలతో మునిగిన రైతన్న
అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది.
ఆరబోసిన పసుపు
ముంచంగిపుట్టు, న్యూస్టుడే: అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది. దీనికితోడు పసుపు సాగు చేసిన పొలాల్లోకి నీరు చేరి, మొక్కలొచ్చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు పసుపు ఉడికించి కల్లాల్లో ఆరబోసి ఉంచారు. ఇదంతా తడిసిపోయింది. మాకవరం, కరిముఖిపుట్టు, పెదగుడ, కిలగాడ, జర్రెల, జర్జుల, బంగారుమెట్ట ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిలిచింది. అసలే ఈ ఏడాది మార్కెట్లో పసుపు ధర పతనమైంది. గతేడాది కేజీ రూ. 90 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది గరిష్ఠంగా రూ. 58కి మించి చెల్లించడం లేదు. ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు నిండా ముంచాయని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పంట కాపాడుకునేందుకు పాట్లు
ఎటపాక, న్యూస్టుడే: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. గంటల వ్యవధిలోనే వర్షం కురవడం, ఆగిపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. సోమవారం ఉదయం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండటంతో గత రెండు రోజులుగా టార్పాలిన్ కింద భద్రపరిచిన మిరప కాయలను ఆరబోసుకున్నారు. ఇంతలోనే మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో వాటిని మరోసారి కుప్పలు చేసుకుని టార్పాలిన్ కప్పేలోపు మిరప కాయలు తడిశాయి. గుండాలకాలనీ, కన్నాయిగూడెం, ఎటపాక, రాజుపేట, మేడువాయి, పిచ్చుకలపాడు, గన్నవరం, మురుమూరు, నందిగామ, సీతాపురం, తోటపల్లి, కృష్ణవరం గ్రామాల్లో కల్లాల్లోని మిరపకాయలు వర్షానికి తడిశాయి.
దేవీపట్నం, న్యూస్టుడే: వర్షాలు తగ్గుముఖం పట్టకపోడంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పొత్తులు తడిచిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పూడిపల్లి, ఎ.వీరవరం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులకు కొన్ని చోట్ల మొక్కజొన్న చేలు నేలవాలాయని రైతులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలనాటి ప్రేమ ఇప్పుడేమైంది..!
[ 21-05-2024]
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల జోలికే పోని నేతలు ఎన్నికల ముందు హడావిడి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని, రహదారులను బాగుచేస్తామని, పట్టణాలను సుందరీకరిస్తామని, సెంట్రల్ లైటింగ్తో వెలుగులు నింపుతామని ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి ఓటర్లకు గాలం వేశారు. -
కరకలో తవ్వకాలపై కన్నెర్ర
[ 21-05-2024]
అత్యంత విలువైన వైఢూర్యాలు (అలెక్స్ రకం రంగురాళ్లు) లభించే గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ చుట్టూరా గస్తీ పటిష్ఠం చేశారు. -
అప్రకటిత కోతలు.. అదనపు వాతలు
[ 21-05-2024]
ఎండలు మండిపోతే లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.. వర్షం కురిసినా.. గాలి వీచినా అంతకంటే వేగంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారు. -
చంద్రబాబు సీఎం కావడం ఖాయం
[ 21-05-2024]
రాబోయేది కూటమి ప్రభుత్వమేనని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై చర్యలు
[ 21-05-2024]
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయసునీత హెచ్చరించారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
రంపచోడవరంలో ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత పేర్కొన్నారు. -
ఈవీఎంల భద్రతలో అప్రమత్తం
[ 21-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా, రిటర్నింగ్ అధికారులు వి.అభిషేక్, భావన తెలిపారు. -
ఐటీఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు
[ 21-05-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. -
అరకు పర్యటకానికి కొత్తరూపు
[ 21-05-2024]
ఆంధ్రాఊటీ అరకులోయలో ఐదు యూనిట్ల పరిధిలోని పర్యటకశాఖ అతిథిగృహాల మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
[ 21-05-2024]
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులతోపాటు బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. -
మూడు రోజులు.. 112 కిలోల చందనం
[ 21-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో సోమవారం మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది. -
తెలంగాణ ఈసెట్లో విద్యార్థి సత్తా
[ 21-05-2024]
పరవాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి దళాయిపాలెం గ్రామానికి చెందిన ఆలవెల్లి ఖ్యాతీశ్వర్ సోమవారం విడుదలైన తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్) మెటలర్జికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. -
24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
[ 21-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఏడు కేంద్రాల్లో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి.బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్