జొన్న రైతుకు ఎంత కష్టం!
జొన్న రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో పంట చేతికి రానుంది.
పొట్ట దశకు చేరిన పంట
జొన్న రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో పంట చేతికి రానుంది. రెండేళ్ల కిందట జొన్నలు క్వింటా ధర రూ.2200 ఉండగా గతేడాది రూ.1700 లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ ధర కూడా దక్కేలా లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గన్నవరం మండలంలోని సావరగూడెం, పురుషోత్తపట్నం, ముస్తాబాద, సూరంపల్లి గ్రామాల్లో సుమారు 350 ఎకరాల్లో దాళ్వాగా జొన్న పంటను సాగు చేశారు. దాళ్వాలకు ఆయా గ్రామ చెరువుల నుంచి నీటిని పంటలకు అందించేందుకు మోటార్లు ఉపయోగిస్తుంటారు. మోటార్లకు అయ్యే ఖర్చుతో పాటు విత్తనం విత్తే దశ నుంచి పంట చేతికొచ్చే వరకు పెట్టుబడి ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడే భారంగా మారిందనుకుంటే చెరువుల నుంచి నీటి తడులకు అదనపు ఖర్చవుతుందని కర్షకులు వాపోతున్నారు. దీంతో జొన్న పంటను సాగు చేస్తే అప్పులపాలవుతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్ యార్డుల ద్వారా జొన్నలను క్వింటా ధర రూ.2500 చొప్పున కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..