ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై పోలీసు అధికారి అత్యాచారం
ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపై అత్యాచారం చేసి, తర్వాత గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించిన వ్యవహారంలో సహాయ ఇన్స్పెక్టర్ సహా ...
గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్
కోర్టు జోక్యంతో ఆయన సహా 8 మందిపై కేసు
ఆర్కేనగర్, న్యూస్టుడే: ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపై అత్యాచారం చేసి, తర్వాత గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించిన వ్యవహారంలో సహాయ ఇన్స్పెక్టర్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ(32)కు వివాహమై తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. భర్తతో విడాకులు తీసుకొని మరో వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అతను మోసం చేయడంతో పళుగల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించి అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ సుందరలింగం (40) పలుచోట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చినట్లు తెలియడంతో స్నేహితులతో కలిసి ఆటోలో ఆమెను పులియరంగిలోని క్లినిక్లో డాక్టర్ కార్మల్ రాణి (38) వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలని నమ్మించి అబార్షన్ చేయించారు. దీనిపై బాధితురాలు పలుమార్లు కకళియకోవిల్, మార్తాండం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాలలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో బాధితురాలు కుళిత్తురై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి.. సుందరలింగం, గణేష్కుమార్ (35), మార్తాండానికి చెందిన అభిషేక్ (45), తిరువట్టార్కు చెందిన కార్మల్ రాణి, దేవదరాజ్ (57) తదితర ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు మార్తాండం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!