logo

Andhra News: ఈనాడు ఎడిటర్‌కు తెలుగు భాషా పురస్కారం ప్రదానం

కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం విజయవాడ నగరం...

Updated : 11 Feb 2022 07:41 IST

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం విజయవాడ నగరం గాంధీనగర్‌లోని హోటల్‌ ఐలాపురంలో నిర్వహించారు. ఈ ఏడాది మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కారాన్ని శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, సమాచార హక్కు చట్టం కమిషనర్‌ ఐలాపురం రాజా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌ ఈనాడు పత్రిక ఎడిటర్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్‌ ఎం.నాగేశ్వరరావుకు అందజేశారు. రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జి.వి.పూర్ణచంద్‌, ఉపాధ్యక్షుడు గుమ్మా సాంబశివరావు, సభ్యులు డాక్టర్‌ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, సిరిపురపు అన్నపూర్ణ, ఎస్‌.శైలజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని