Andhra News: తన స్థలం ఇప్పించమని.. ఐదేళ్లుగా అధికారుల చుట్టూ..!
గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన కోట మల్లయ్యకు తాతల ఆస్తి 22 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 10 సెంట్లను ఇతరులు ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు
ఈనాడు, అమరావతి: గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన కోట మల్లయ్యకు తాతల ఆస్తి 22 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 10 సెంట్లను ఇతరులు ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు ఇప్పించాలని 2018 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్థలం పత్రాలను అధికారులకు ఇచ్చారు. సర్వే చేయించి ఆక్రమణకు గురైన తన స్థలం గుర్తించి తనకు ఇప్పించాలని 2018, 2021లో చలానా కూడా కట్టారు.అయినా అధికారులు వచ్చి సక్రమంగా కొలతలు వేసి.. ఆక్రమిత స్థలాన్ని తనకు ఇప్పించలేకపోయారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల నుంచి భార్యా పిల్లలతో కలెక్టరేట్, అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, తనకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. చేనేత వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని..తనకు న్యాయం చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్లోని అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్