కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు కొనసాగించాలి
అంబేడ్కర్ పేరు కోనసీమ జిల్లాకు కొనసాగించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు లాడ్జికూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ కోనసీమలో విధ్వంస..
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్కుమార్
లాడ్జికూడలిలో నిరసన ప్రదర్శన చేస్తున్న అరుణ్కుమార్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
బ్రాడీపేట, న్యూస్టుడే: అంబేడ్కర్ పేరు కోనసీమ జిల్లాకు కొనసాగించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు లాడ్జికూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ కోనసీమలో విధ్వంస వాతావరణాన్ని నెలకొల్పడంపై మాలమహానాడు, దళిత, ప్రజా సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులు పట్టుకొని కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును కొనసాగించాలని నినాదాలు చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్య దళిత నాయకులను నిలువరించగా, శాంతియుతంగా తమ నిరసన ప్రదర్శన ఉంటుందని, 20 నిమిషాల పాటు అనుమతి ఇవ్వాలని కోరగా ఇచ్చారు. అంతలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపడతామని, అనుమతి ఇవ్వాలని కోరగా, డీఎస్పీ కుదరదని చెప్పడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అంబేడ్కర్ పేరును వ్యతిరేకించి విధ్వంసం సృష్టిస్తుంటే చోద్యం చూసిన పోలీసులు శాంతియుతంగా నిరనస తెలియజేస్తామంటే తమను అడ్డుకోవడం సరికాదని, లాడ్జికూడలిలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి దళిత నాయకులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. నిరసన ప్రదర్శనను భగ్నం చేస్తే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. ఈ సందర్భంగా గోళ్ల అరుణ్కుమార్ మాట్లాడుతూ సాక్షాత్తు దళిత మంత్రి విశ్వరూప్ ఇంటిపైనే వందల సంఖ్యలో రౌడీమూకలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు నిలువరించలేకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని, లేకపోతే త్వరలో చలో కోనసీమను నిర్వహిస్తామని హెచ్చరించారు. భీమ్సేనా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. సుమారు రెండు గంటల పాటు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బత్తుల అనిల్కుమార్, బత్తుల వీరాస్వామి, చార్వాక, మద్దు అంకయ్య, వైకే, శిరిపురపు శ్రీధర్, జూపూడి శ్రీనివాస్, మాలమహానాడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోదా జాన్పాల్, చేబ్రోలు మనోరంజని, పిల్లి మేరి, గనిక జాన్సీ, దారా హేమప్రసాద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, పాగళ్ల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
కోనసీమ జిల్లాలో జరుగుతున్న హింసకు కారకులైన వారిని వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొంతా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వ్యతిరేకించి విధ్వంసానికి పాల్పడటంపై స్థానిక లాడ్జికూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నల్లపు నీలాంబరం, చింతా రామ్ప్రసాద్, చిరతనగండ్ల వాసు, మణికుమారి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.