దొరకని డీఏపీ.. సాగని వరి!
అసలే ఎడతెరిపిలేని వర్షాలు.. దెబ్బతింటున్న పంటలు.. పొలాల్లో నీరు నిలిచి ఏంచేయాలో తోచని జిల్లా రైతులు. పెట్టుబడుల కోసం ఎదురుచూపులు..
దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు ● అవస్థలు పడుతున్న రైతులు
న్యూస్టుడే, పరిగి, వికారాబాద్ గ్రామీణ
మడి నుంచి నారు తీస్తున్న కూలీలు
అసలే ఎడతెరిపిలేని వర్షాలు.. దెబ్బతింటున్న పంటలు.. పొలాల్లో నీరు నిలిచి ఏంచేయాలో తోచని జిల్లా రైతులు. పెట్టుబడుల కోసం ఎదురుచూపులు.. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఇదే వర్షాలతో వరి సాగుకు అనుకూలమని కొందరు సాగు పనులు చేపడదామని చూస్తే...ఎరువుల కొరత.. వెరసి రైతుకు ఎటూ పాలుపోని పరిస్థితి. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
నిరాశతో వెనుదిరగడమే..
జిల్లాలో ప్రధానంగా డీఏపీ ఎరువు ఎక్కడా దొరకడం లేదు. నిత్యం వివిధ గ్రామాల నుంచి రైతులు మండల కేంద్రాల్లోని వ్యాపారుల వద్దకు వచ్చి ఆరా తీస్తున్నారు. డీఏపీ రావడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఈ ప్రభావం వరి సాగుపై ప్రత్యక్షంగా పడుతోంది. అధిక వానలు కేవలం వరి పంటకు మాత్రమే అనుకూలంగా మారాయి. దీంతో వరి సాగుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. 20రోజుల క్రితమే నారుమళ్లను పోసుకున్న రైతులు సాగుకు ఉపక్రమించారు. పలుచోట్ల నాట్లు ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధానంగా డీఏపీ ఎరువుల అవసరత ఉంది. పది రోజులుగా ఎక్కడా బస్తా డీఏపీ ఎరువు దొరకడం లేదని వాపోతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక రైతన్నలు సతమతమవుతున్నారు. అరకొరగా ఉన్న చోట్ల అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
* దోమ మండలం బాసుపల్లి గ్రామానికి చెందిన మొగులయ్యకు రెండెకరాల విస్తీర్ణంలో పొలం ఉంది. వరి సాగుకు నెల రోజుల క్రితం నారుమడి పోసుకున్నాడు. దమ్ము పనులు పూర్తయ్యాక ఎరువుల కోసం వారం రోజులుగా నిత్యం పరిగికి తిరుగుతున్నాడు. పది దుకాణాల్లో అడిగినా డీఏపీ లేదన్న సమాధానమే
* ప్రభుత్వం బస్తా డీఏపీ ధరను రూ.1,350కి నిర్ణయించగా వ్యాపారులు మాత్రం రూ.50 నుంచి రూ.80 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ ప్రాంతాల్లో ఈ వ్యవహారం కొనసాగుతోంది.
కోటాలో కోత..
జిల్లాకు సరిపడా కోటా రాకపోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. వచ్చినా అరకొరగానే వస్తోందని ఇదే కొరతకు కారణమని పేర్కొంటున్నారు. వానాకాలం అన్ని రకాల పంటల సాధారణ సాగు 5,31,500 ఎకరాలు. ఇందులో ఇప్పటివరకు సుమారు 4 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలకు సాగులోకి వచ్చాయి. మొత్తంగా 88,200 ఎకరాల్లో వరి సాగుకు అధికారులు అంచనా వేశారు.
* డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ సీజన్కు యూరియా 36,229 మెట్రిక్ టన్నులు, డీఏపీ 15,615, ఎంఓపి 9,248, కాంప్లెక్సు ఎరువులు 25,732, ఎస్ఎస్పి 8,798 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదించారు. సాగు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు విడతల వారీగా డిమాండును బట్టి సరఫరా కావాల్సి ఉంది. ఇందులో డీఏపీ కనీసం సగానికి సగం కూడా సరఫరా కాలేదని సమాచారం.
* జిల్లా వ్యాప్తంగా డీఏపీ కేవలం 829 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని అధికారుల సమాధానం. ఇతర ఎరువులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
లేవని చెబుతున్నారు : అంజిలయ్య, దోమ
రెండెకరాల్లో వరి సాగుకు నారు పోసుకున్నాం. నాట్లు వేసుకునేందుకు అదను వచ్చింది. తీరా డీఏపీ ఎరువు కోసం పరిగికి వెళ్తే వ్యాపారులు లేవని చెబుతున్నారు. జాప్యం చేస్తే సాగు సమయం దాటిపోతుందన్న భయం వెంటాడుతోంది. ఇప్పటికే వేసుకున్న పత్తి పంట వర్షాలకు పాడైంది. కనీసం వరి సాగు చేసుకుందామని అనుకున్నా ఎరువులు దొరకడం లేదు.
చర్యలు తీసుకుంటాం: గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
డీఏపీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. వరి సాగుకు ఒక డీఏపీ ఎరువు కాకుండా 20:20 ఎరువును వాడవచ్ఛుజిల్లాలోని నేలల్లో భాస్వరం అధికంగానే ఉంది. డీఏపీ బదులుగా పీఎస్బి (పాస్ఫరస్ సాలిబులైజింగ్ బాక్టీరియా)ను ఎకరానికి 2 కిలోలు వాడితే చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.