సెప్టెంబరులోపు విమానాశ్రయ మెట్రో పనులు
విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు పనులను సెప్టెంబర్ నాటికి ప్రారంభించాలని, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎఎంఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు పనులను సెప్టెంబర్ నాటికి ప్రారంభించాలని, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎఎంఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బుధవారం బేగంపేట్లోని మెట్రో రైల్ భవన్లో ప్రీబిడ్ సమావేశం నిర్వహించగా పాల్గొన్న బిడ్డర్లకు ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు. 31 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) కాంట్రాక్టర్ను ఎంపిక చేసేందుకు ఓపెన్ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా నిర్వహించిన ప్రీబిడ్ సమావేశంలో 13 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో ఎల్అండ్టీ, అల్స్టోమ్, సీమెన్, టాటా ప్రాజెక్ట్స్, ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పాండ్రోల్ సంస్థలున్నాయి. సర్వే, పెగ్మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ తదితర ప్రాథమిక పనులు చాలా వరకు పూర్తయ్యాయని, భూసార పరీక్షలు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఓ భూగర్భ మెట్రో స్టేషన్ సహా మొత్తం 9 స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. సివిల్ నిర్మాణాలు, రోలింగ్స్టాక్(రైళ్లు), సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థలు, పనితీరు సూచికలు, సాంకేతిక లక్షణాలు మొదలైన వాటికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు వ్యయం రూ.6,250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. హెచ్ఎండీఏ, జీఎంఆర్ ఎయిర్పోర్టు 10 శాతం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హెచ్ఏఎంఎల్ సలహాదారు సుబోధ్ జైన్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డి.వి.ఎస్.రాజు, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జీఎం ఎం.విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఈ సాయపరెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ జేఎన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి
[ 13-06-2024]
రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. -
కొడంగల్లో విద్యాసంస్థల నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరు
[ 13-06-2024]
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.45 కోట్లు మంజూరు చేసింది. -
హైదరాబాద్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
[ 13-06-2024]
నగరంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. -
బుడిబుడి అడుగులు..చదువులకు పరుగులు
[ 13-06-2024]
వేసవి సెలవులు ముగిశాయి. కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఇన్ని రోజులు ఇళ్లలో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభంతో తరగతి గదుల్లో అడుగుపెట్టారు. -
శివారులన్నీ బల్దియాలోకి
[ 13-06-2024]
హైదరాబాద్ శివారులోని ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు -
రూ.200 కోట్ల మనీ లాండరింగ్లో నిందితురాలని బెదిరించి..
[ 13-06-2024]
మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్నారని ఫోన్ చేసి నగదు దోచేశారంటూ బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో బుధవారం ఫిర్యాదు చేశారు. -
వెలుగుల మాటున చేతి వాటం
[ 13-06-2024]
విద్యుత్తు కనెక్షన్ల జారీ, పాడైన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, లైన్ క్లియర్ అనుమతి, సీటీబీటీ మీటర్లకు సీల్ వేయడం..ఇలా ప్రతిదాంట్లో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, ఇంజినీర్లు బహిరంగంగానే వసూళ్లకు తెగబడుతున్నారు. -
నీరు నిలిస్తే.. ఖర్చు యజమానులదే
[ 13-06-2024]
వర్షాకాలం మొదలైనందున డెంగీ, మలేరియా, ఇతర వ్యాధుల నుంచి నగరవాసులకు రక్షణ కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు -
ఇన్స్టాలో స్నేహం.. పెళ్లయ్యాక డ్రగ్స్ వ్యాపారం
[ 13-06-2024]
బెంగళూర్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న భార్యాభర్తలు సయ్యద్ ఫైజల్ (27), ముషారత్ ఉన్నీసాబేగం అలియాస్ నదియా(27)తోపాటు జునైద్ఖాన్(29), మహ్మద్ అబ్రార్ ఉద్దీన్(28), రహ్మత్ఖాన్(46)లను తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీన్యాబ్) పోలీసులు అరెస్టు చేసినట్టు బుధవారం తెలిపారు. -
శివార్లలో ధార్ గ్యాంగ్.. పోలీసుల అలర్ట్
[ 13-06-2024]
నగర శివార్లలో ధార్ గ్యాంగ్ కదలికల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకేసారి ఎక్కువ ఇళ్లలో దోపిడీలతో దడ పుట్టించే ఈ ముఠా శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో రాత్రిపూట పెట్రోలింగ్ పెంచాలని నిర్ణయించారు. ‘ -
పబ్బుల్లో అమ్మాయిలతో ఎర.. డబ్బు గుంజేసే ముఠా
[ 13-06-2024]
ఆన్లైన్ డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలను ఎరగా వేసి పబ్బుల్లో దందా నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్టుచేశారు. -
రూ.7 కోట్లు వసూలు చేసి మరొకరికి కాంట్రాక్టు
[ 13-06-2024]
మణికొండ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో మరో కుంభకోణం బయపడింది. సొసైటీ భూముల్లో ట్విన్ టవర్స్ నిర్మాణం పేరుతో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ తన దగ్గర రూ.7 కోట్లు వసూలు చేశారని ఓ కాంట్రాక్టరు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల్ని ఆశ్రయించారు. -
దూకుడు తగ్గేదెలా !
[ 13-06-2024]
రవాణాశాఖ నిబంధనల ప్రకారం..డ్రై వింగ్ లైసెన్సు పొందలేని మైనర్లు వాహనాలను నడపొద్దు.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసినా పిల్లలకు వాహనాలు ఇవ్వడంతో దూకుడుగా వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు -
పాఠశాల బస్సులపై కొరడా
[ 13-06-2024]
గ్రేటర్వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు తెరుచుకున్న దృష్ట్యా రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫిట్నెస్ లేకపోవడంతోపాటు త్రైమాసిక పన్నులు చెల్లించకుండా రోడ్డెక్కిన బస్సులపై కొరడా ఝుళిపించారు. -
నవ్వాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
అక్రమార్కులతో అధికారుల జట్టు
[ 13-06-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో ప్రణాళిక విభాగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెచ్ఎండీఏలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల్లో కీలకమైన ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాళన చేయడంతోపాటు బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. -
రామోజీరావు స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
[ 13-06-2024]
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు ఆయన మానస విద్యాలయం రమాదేవి పబ్లిక్ స్కూల్లో బుధవారం పాఠశాల ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. -
కళాశాలల గుర్తింపు ప్రక్రియ రెండో విడతపై కసరత్తు
[ 13-06-2024]
ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపులో కీలకమైన అప్పిలేట్ కమిటీ పరిశీలన రెండో ఫేజ్కు జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. -
తొలిరోజే.. తప్పని నిరీక్షణ!
[ 13-06-2024]
పాఠశాలల పునః ప్రారంభమైన తొలిరోజే బుధవారం ఉర్దూ మాధ్యమం పాఠశాల తెరుచుకోక పిల్లలు నిరీక్షించి ఇంటిదారి పట్టారు. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం..మండల పరిధిలోని ఎన్కతలలో ఉర్దూ విద్య అభ్యసించేందుకు ప్రాథమిక పాఠశాల ఉంది. -
గంజాయి ఘాటు..కట్టడి చేయకుంటే చేటు
[ 13-06-2024]
జిల్లాల గంజాయి అక్రమ రవాణా, వాడకం చాపకింద నీరులా విస్తరిస్తోంది. యువతే లక్ష్యంగా గంజాయి దందా కొనసాగుతోంది. -
ఆ ప్రచారం నమ్మొద్దు.. సాధారణ బస్సు ఛార్జీలు పెంచలేదు: టీజీఎస్ ఆర్టీసీ
[ 13-06-2024]
తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (TGS RTC) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రులకు శాఖల కేటాయింపు.. కొనసాగుతున్న చంద్రబాబు కసరత్తు
-
ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ నాగరాజు
-
అమెరికాతో మ్యాచ్.. స్పెషల్ గెస్ట్ చేతులమీదుగా సిరాజ్కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు
-
కువైట్ విషాదం.. మూడంతస్తుల పైనుంచి దూకి.. ప్రాణాలు రక్షించుకొని!
-
నన్ను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలు తేవొద్దు: పవన్
-
4 రోజుల్లో 4 ఉగ్రదాడులు.. జమ్మూ-కశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష