నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా సముదాయ భవనాలు
జిల్లాలో సముదాయ భవనాలు సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సరస్వతి కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు అధికారులకు సూచించారు.
డా.బాబు జగ్జీవన్రాం భవనం, విగ్రహం
బళ్లారి, న్యూస్టుడే: జిల్లాలో సముదాయ భవనాలు సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సరస్వతి కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు అధికారులకు సూచించారు. జిల్లా యంత్రాంగం, పంచాయతీ, సమాజ సంక్షేమ శాఖ సంయుక్తంగా స్థానిక నల్లచెరువులోని 4.31 ఎకరాల విశాలప్రదేశంలో ఏర్పాటు చేసిన డా.బాబు జగ్జీవన్రాం నూతన భవనం, విగ్రహ ప్రతిష్ఠాపనను మంత్రి ప్రారంభించారు. బాబు జగ్జీవన్రాం దేశం గౌరవించే మహావ్యక్తి. హరిత విప్లవం కోసం శ్రమించిన నేత, అంటురాని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు. ఆయన పేరు మీద నిర్మించిన భవనం, విగ్రహం ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం బుడకట్టు సముదాయం అభివృద్ధికి రూ.15వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. దళిత, గిరిజన వర్గాల సముదాయం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం రూ.4,500 కోట్ల నుంచి రూ.9500 కోట్లకు పెంచే ఆలోచన ఉందన్నారు. గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు హెచ్.హనుమంతప్ప, లోక్సభ మాజీ సభ్యురాలు శాంత, వివిధ సంక్షేమ శాఖల అధికారులు సతీశ్, సకీనా, సురేష్, శాషు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పింజార్ రంజాన్సాబ్ విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి, తదితరులు
పింజార్ రంజాన్సాబ్ విగ్రహం ప్రతిష్ఠ
నగరంలోని స్థానిక డా.రాజ్కుమార్ రహదారిలోని కేంద్ర గ్రంథాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కర్ణాటక ఏకీకరణకు పోరాటం చేసిన పహిల్వాన్ కప్పగల్ పింజార్ రంజాన్సాబ్ విగ్రహాన్ని మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యులు, అధికారులు ఆవిష్కరించారు.
జగ్జీవన్రాం భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యులు, అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్యారంటీలకు జవజీవాలు!
[ 21-05-2024]
ఓ వైపు విపక్షాలు ఆరోపిస్తున్నా.. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇచ్చిన హామీల ప్రకారం ‘గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. -
కాంగ్రెస్ సాధన శూన్యం
[ 21-05-2024]
కాంగ్రెస్ సర్కారు ఏడాది కాలంలో సాధించింది శూన్యమని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర అన్నారు. -
ప్రజ్వల్.. లొంగిపో
[ 21-05-2024]
నాపైనా, హెచ్డీ దేవేగౌడపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని- హాసన సెక్స్స్కాండల్లో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్కు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వానికే అనారోగ్యం
[ 21-05-2024]
కర్ణాటకలో ప్రభుత్వం అనారోగ్యం బారినపడి- ఐసీయూలో ఉందని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. -
ఎగువసభలో 11 స్థానాలకు ఎన్నికలు
[ 21-05-2024]
విధానపరిషత్లో ఖాళీ అవుతున్న 11 స్థానాలకు జూన్ 13న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
చిన్నారిపై కర్కశ చూపు
[ 21-05-2024]
ముక్కుపచ్చలారని ఓ బాలిక (10)పై దుండగుడు కర్కశత్వానికి ఒడిగట్టాడు. ఆమెపై లైంగిక దాడికి తెగించిన ఆరోపణపై బిహార్ నివాసి రాజేశ్గుప్తా (55)ను హెబ్బాళ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
సీబీఐ దర్యాప్తునకు దళ్ పట్టు
[ 21-05-2024]
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘పెన్డ్రైవ్’ సంఘటనపై విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని డిమాండు చేస్తూ బెంగళూరులోని స్వతంత్ర ఉద్యానవనంలో జనతాదళ్ (ఎస్) కార్యకర్తలు సోమవారం ధర్నాకు దిగారు. -
ఆన్లైన్లో రూ.17 లక్షలు మాయం
[ 21-05-2024]
ఆన్లైన్లో ఓ మహిళ రూ.17 లక్షలు మోసపోయిన సంఘటన బళ్లారి జిల్లాలో ఆలస్యంగా బయటపడింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్