ఈసారీ అధిక మెజార్టీ ఇవ్వండి: నామా
గత లోక్సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు.
ఎంవీపాలెంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాతా మధు, పక్కన ఎంపీ నామా, మాజీ ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం గ్రామీణం: గత లోక్సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఎంవీపాలెం, పెద్దతండాలో బుధవారం ప్రచారం నిర్వహించారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ నామాకు అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ తెలంగాణవాదాన్ని పార్లమెంట్లో వినిపించేది భారాస మాత్రమేనన్నారు. బెల్లం వేణు, బెల్లం ఉమ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్కారు బడుల తడబాటు..!
[ 14-06-2024]
బడులు తెరిచే రోజు పండగ వాతావరణం కల్పిస్తాం.. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం.. ఇందుకోసం సంసిద్ధత కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం.. బడులు లేని గ్రామాలు ఉండవు.. విద్యార్థులకు సకల వసతులు సమకూర్చుతామని అధికారులు పదేపదే చెప్పినా ఆచరణలో విఫలమయ్యారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. -
గోదావరి జలాలతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం
[ 14-06-2024]
గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను సస్యశ్యామలం చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారు దలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరందించటానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. -
రైతులకు న్యాయం చేస్తాం: మంత్రులు
[ 14-06-2024]
సీతారామ ప్రాజెక్టు అనుసంధాన కాలువ భూనిర్వాసితులు ఏ ఒక్కరూ నష్టపోకుండా నీళ్లు రాకముందే అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
‘ఆశా కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించొద్దు’
[ 14-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించాలని యోచించటం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మా విష్ణువర్ధన్, కల్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. -
మదింపుపై రెట్టింపు సన్నద్ధం
[ 14-06-2024]
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి పెరగాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయ భూములు, ప్లాట్లు, స్థలాల మార్కెట్ విలువ పెంచాలని, తద్వారా రిజిస్ట్రేషన్ల సమయంలో ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది. -
2.44 కుటుంబాలకు గృహ జ్యోతి
[ 14-06-2024]
వేసవి అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్తు వినియోగం గత మూడు నెలల్లో ఎక్కువగా ఉంది. అందుకే జీరో బిల్లు పొందే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. వాతావరణం చల్లబడటంతో జూన్ నుంచి జీరో బిల్లు పొందేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. -
పాత ఇంటికి ‘వంద’నం
[ 14-06-2024]
అది ఓ చిన్న పల్లెటూరు.. ఇప్పటికే చాలా మంది పాతతరం నాటి ఇళ్లను ఖాళీ చేసి వారి పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న చోటకు వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
అరుదైన దాతలు
[ 14-06-2024]
రక్తం.. మానవ శరీరం కోల్పోయినా, తగ్గిపోయినా, పాడైపోయినా దాని విలువ నిండు ప్రాణం.. రక్తం పంచుకుని పుట్టకున్నా ఆపదలో ఉన్నవారికి రక్తం పంచి, వారి ఆయువును పెంచే మహదవకాశం మనకే.. మనుషులకే ఉంది.. అందుకే రక్తదాతను ‘ప్రాణదాత’కు పర్యాయపదంగా పిలుస్తాô. -
పూసుగుప్ప అడవుల్లో బూబీట్రాప్స్ వెలికితీత
[ 14-06-2024]
చర్ల మండలంలోని మారుమూల పూసుగుప్ప అడవుల్లో భద్రతా బలగాలు మరోమారు మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీట్రాప్స్ను గుర్తించి వెలికితీశారు. ఈనెల 10వ తేదీన ఇక్కడి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, చర్ల పోలీసులు పెద్దఎత్తున బూబీట్రాప్స్ను గుర్తించి వెలికితీసిన విషయం తెలిసిందే. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. మహిళ దుర్మరణం
[ 14-06-2024]
పెళ్లి వేడుకకు వెళ్లి సంతోషంగా తిరిగొస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పాల్వంచ మండలంలోని మొండికట్ట వద్ద ఓ మూలమలుపులో సంఘటన చోటుచేసుకుంది. -
అటకెక్కిన కరకట్టల నిర్మాణం
[ 14-06-2024]
గోదావరి పరివాహకంలోని గ్రామాలకు ముంపు ముప్పు నివారణకు తలపెట్టిన కరకట్టల నిర్మాణం అటకెక్కింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల పరిధిలో గోదావరికి రెండువైపులా కరకట్టల నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు (Latest News)
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
కువైట్ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్
-
మండల కేంద్రాలు, పట్టణాల్లో రిమోట్ వర్క్ స్టేషన్లు: చంద్రబాబు
-
నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు: వైరల్గా అధ్యక్షుడి వ్యవహారశైలి