‘ఉమామహేశ్వర’తో నల్లమలకు సాగునీరు
రాష్ట్ర మంత్రిమండలి గురువారం తీసుకున్న పలు నిర్ణయాలు పాలమూరుపై ప్రభావం చూపనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం ఫేజ్-1, ఫేజ్-2 మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
సీఎంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. చిత్రంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్ : రాష్ట్ర మంత్రిమండలి గురువారం తీసుకున్న పలు నిర్ణయాలు పాలమూరుపై ప్రభావం చూపనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం ఫేజ్-1, ఫేజ్-2 మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,534 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఫేజ్-1లో భాగంగా బల్మూరు మండలం మైలారం సమీపంలో ఉమామహేశ్వర జలశాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఫేజ్-2లో అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో చెన్నకేశవ జలాశయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు వస్తే నల్లమలకు కృష్ణా జలాల ద్వారా సాగునీరు సరఫరా జరుగుతుంది.
* మంత్రి మండలిలో రెండో విడత గొర్రెల పంపిణీని 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 68,340 యూనిట్లను పంపిణీ చేయనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మాదాసి కురవలకు అదనంగా మరో 30వేల యూనిట్ల పంపిణీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో 67 వేల యూనిట్లను పంపిణీ చేశారు. ఇప్పటికే కలెక్టర్ల పర్యవేక్షణలో రెండో విడతలో మహబూబ్నగర్లో 16,167 యూనిట్లు, గద్వాల-8,354, వనపర్తి-11,667, నాగర్కర్నూల్-19,762, నారాయణపేట జిల్లాలో 12,390 యూనిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
* కొత్త మండలాల్లో పీహెచ్సీలను ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2016లో కొత్తగా ఏర్పడిన పలు మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి, కేటీదొడ్డి, నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ, వనపర్తి జిల్లా చిన్నంబావి, అమరచింత, నారాయణపేట జిల్లా కృష్ణలో పీహెచ్సీలు ఏర్పాటు చేయలేదు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో కౌకుంట్ల, నారాయణపేట జిల్లాలో కొత్తపల్లి, గుండుమాల్ను మండల కేంద్రాలుగా మార్చారు. కౌకుంట్ల, కొత్తపల్లిలో పీహెచ్సీలు లేవు. క్యాబినెట్ నిర్ణయంతో ఈ మండలాలకు పీహెచ్సీలు మంజూరయ్యే అవకాశాలున్నాయి.
* నకిలీ విత్తనాలపై పీడీ కేసులు నమోదు చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని భూత్పూర్, గద్వాల కేంద్రంగా సాగుతున్న పత్తి విత్తనాల కేంద్రాలపై దాడులు కొనసాగనున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. గద్వాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న వారిపై గతంలో పీడీ కేసులను నమోదు చేశారు. మూడు రోజుల కిందట నారాయణపేట జిల్లా ఊట్కూర్లో నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. ఇప్పటికే ఠాణాలవారీగా అనుమానితులను గుర్తించి తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశారు. వానాకాలం సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 9 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే అవకాశాలున్నాయి. ఈ వర్షాకాలం సీజన్లో భారీగా పత్తి విత్తనాల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలపై పూర్తి స్థాయి నిఘా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
ఎత్తిపోతల మంజూరుపై సీఎంకు కృతజ్ఞతలు
ఈనాడు, హైదరాబాద్: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై సీఎం కేసీఆర్కు మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం ఒకటో దశలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లోని ఏదుల జలాశయం నుంచి అయిదు టీఎంసీల నీటిని ఉమామహేశ్వర జలాశయానికి తరలించి 57,200 ఎకరాలకు సాగునీరు, దారి మధ్యలో ఉండే గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. దీనికోసం రూ.1534.50 కోట్లు మంజూరు చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండో దశ విస్తరణ కూడా ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేతన్నకు చేయూత’ నిధులు అందించాలని వినతి
[ 20-05-2024]
చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్టుఫండ్ (నేతన్నకు చేయూత) పథకం నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలని రాజోలి చేనేత కార్మికులు ఆ శాఖ ఏడీ గోవిందయ్యకు సోమవారం విన్నవించారు. -
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
-
ప్లేఆఫ్స్ తొలి పోరు... రైడర్స్పై సన్ ‘రైజ్’ అయితే ఫైనల్కు!