హరితవనాల నిధుల గోల్మాల్పై విచారణ
హరితవనాల నిధుల గోల్మాల్పై త్రీమెన్ కమిటీ విచారణ జరుగుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ విరోజ తెలిపారు.
అధికారితో మాట్లాడుతున్న పీడీ విరోజ
కౌడిపల్లి, న్యూస్టుడే: హరితవనాల నిధుల గోల్మాల్పై త్రీమెన్ కమిటీ విచారణ జరుగుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ విరోజ తెలిపారు. కౌడిపల్లి మండలం కొట్టాల అటవీప్రాంతంలో నాటిన మొక్కలను మంగళవారం తహసీల్దార్ కమలాద్రి, అటవీశాఖ రేంజి అధికారి ఎల్లయ్య, డిప్యూటీ రేంజి అధికారిణి రాజమణిలతో కలిసి ఆమె పరిశీలించారు. 2019-20లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద హరితవనాల్లో నాటిన మొక్కల నిర్వహణకు సంబంధించి అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కొమురయ్య పేరుమీద రూ.16.40 లక్షల చెల్లింపులపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ పాలనాధికారికి నివేదిక పంపించడంతో విచారణకు ఆదేశించారు. ఈ విషయమై అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ విరోజ మాట్లాడుతూ.. త్రీ మెన్ కమిటీ ద్వారా విచారణ జరుగుతోందని, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. పంచాయతీ ఖాతాలో మొక్కలకు సంబంధించిన నిధులు రావడంతో చెల్లించేందుకు సర్పంచి, ఉప సర్పంచి, ఉపాధి హామీ సాంకేతిక సహాయకురాలు, క్షేత్ర సహాయకుడి కలిపి రూ.6.22 లక్షలు సమర్పించినట్లుగా కొమురయ్య అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేసి ఆధారాలు సమర్పించారు. సర్పంచి నరహరి, ఉపసర్పంచి మాధవరెడ్డి, ఏపీవో పుణ్యదాస్, ఈసీ ప్రేమ్కుమార్, తెరాస గ్రామం ‹ఖ అధ్యక్షులు గౌరిరెడ్డి గ్రామస్థులు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.