మూసీ మింగిందా? సగమే మిగిలిందా?
ప్రస్తుతం మనం చూస్తున్న మూసీ నది వెడల్పు అసలులో సగం మాత్రమే. మిగతాది ఆక్రమణల్లో చిక్కుకొని అన్యుల పాలైంది. ఇది పైపైన చెబుతున్న లెక్క కాదు. నది సుందరీకరణలో భాగంగా మూసీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే చేసి ఇచ్చిన నివేదిక సారాంశం. ఈ నివేదిక ఇంతవరకు బయటకు రాకపోయినా, ఓ ప్రతిని ‘ఈనాడు’ సేకరించింది. మరో ఏడాది అలాగే వదిలేస్తే మహానగరంలో మూసీ నది కనుమరుగైపోయి ఉండేది. ఆక్రమణలను తొలగిస్తేనే సుందరీకరణ చేపట్టొచ్చని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు దాదాపు 400 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు తెలుసుకొని ముక్కున వేలేసుకున్నారు.
మొత్తం ఆక్రమణలు 8475
నదీ గర్భంలో భారీ నిర్మాణాలు
‘ఈనాడు’ చేతిలో రెవెన్యూ సర్వే నివేదిక
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ఎంజీబీఎస్ వద్ద మట్టితో చదును చేసి నిలిపిన ప్రైవేటు బస్సులు
ప్రస్తుతం మనం చూస్తున్న మూసీ నది వెడల్పు అసలులో సగం మాత్రమే. మిగతాది ఆక్రమణల్లో చిక్కుకొని అన్యుల పాలైంది. ఇది పైపైన చెబుతున్న లెక్క కాదు. నది సుందరీకరణలో భాగంగా మూసీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే చేసి ఇచ్చిన నివేదిక సారాంశం. ఈ నివేదిక ఇంతవరకు బయటకు రాకపోయినా, ఓ ప్రతిని ‘ఈనాడు’ సేకరించింది. మరో ఏడాది అలాగే వదిలేస్తే మహానగరంలో మూసీ నది కనుమరుగైపోయి ఉండేది. ఆక్రమణలను తొలగిస్తేనే సుందరీకరణ చేపట్టొచ్చని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు దాదాపు 400 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు తెలుసుకొని ముక్కున వేలేసుకున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. రెండో దశలో తొలగించడం మొదలుపెడతారు. ప్రైవేటు స్థలంలో ఉన్న భవనాలకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు.
మూసారాంబాగ్లో మూసీ వంతెనకు ఆనుకొని వెలసిన అక్రమ నిర్మాణాలు
మరీ ఇంత దారుణమా!
* ఉమ్మడి రాష్ట్రంలో ఏళ్లుగా మూసీ నది అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆక్రమణదారుల కన్నేశారు. ఏడాదిగా రెవెన్యూ అధికారులు నదిపై సర్వే చేపట్టి మొత్తం 8475 ఆక్రమణలను గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు. నదీ గర్భం, బఫర్ జోన్లో ఉన్నవిగా విభజించారు. నదీ గర్భంలో 1585 చోట్ల ఆక్రమణలను గుర్తించగా అందులో 268 చోట్ల భారీ నిర్మాణాలున్నాయని తేల్చారు. కొన్ని చోట్ల అపార్టుమెంట్ల తరహాలో నిర్మించి విక్రయించినట్లు గుర్తించారు. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు ఉన్న బఫర్ జోన్లో 6890 ఆక్రమణలను గుర్తించారు. ఇందులో 1032 భారీ నిర్మాణాలున్నట్లు లెక్క తేల్చారు.
* ఆక్రమణలు అధికంగా బహుదూర్పురా మండలంలో ఉన్నాయి. ఇక్కడ నదీ గర్భంలోనూ, బఫర్ జోన్ పరిధిలో 87 తాత్కాలిక నిర్మాణాలు, 1108 శాశ్వత నిర్మాణాలున్నాయి.
* అంబర్పేట మండలంలో 1148 ఆక్రమణలు, నిర్మాణాలు ఉండగా, తాత్కాలిక నిర్మాణాలు 144 చోట్ల, శాశ్వత భవనాలు 1004 చోట్ల ఉన్నాయి.
* ఉప్పల్ మండలంలో 1001, నాంపల్లిలో 820, గోల్కొండలో 788, ఆసిఫ్నగర్లో 628 చోట్ల ఆక్రమణలు, నిర్మాణాలున్నాయి.
తీర్చిదిద్దనున్నారిలా...
రాజధాని పరిధిలో మూసీ నది 52 కి.మీ. మేర విస్తరించింది. తొలి దశలో బాపూఘాట్ నుంచి నాగోలు వరకు 14 కి.మీ. మేర సుందరీకరించాలని నిర్ణయించారు. రెండు వైపులా నాలుగు లైన్ల రోడ్లతోపాటు పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.3500 కోట్లను వెచ్చించాలని సర్కారు నిర్ణయించింది. త్వరలో సంబంధిత అధికారులతో సీఎం సమావేశం కానున్నారని సమాచారం. దీని తర్వాత అభివృద్ధి పనులపై కార్యాచరణను రూపొందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.