Hyd News: వాచీ పెట్టుకొని వస్తే ఉద్యోగం: మోసపోయిన ఇంటర్ విద్యార్థులు
ఉద్యోగాలు కల్పిస్తామని డబ్బులు తీసుకొని ఓ సంస్థ మోసానికి పాల్పడిందని పలువురు ఇంటర్ విద్యార్థులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగేశ్వరరావు, బాధితులు తెలిపిన ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా,
చందానగర్ ఠాణా వద్ద బాధితులు
శేరిలింగంపల్లి, న్యూస్టుడే: ఉద్యోగాలు కల్పిస్తామని డబ్బులు తీసుకొని ఓ సంస్థ మోసానికి పాల్పడిందని పలువురు ఇంటర్ విద్యార్థులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగేశ్వరరావు, బాధితులు తెలిపిన ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా, భూత్పూర్ మండలం, తాటికొండ గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు గోపన్పల్లి సురేష్. ఇతని స్నేహితుడు శ్రీకాంత్లు భూత్పూర్ గ్రామంలో కళాశాలలో చదువుతున్న పలువురిని కలిశారు. నిరుద్యోగులు ఒక్కొక్కరు రూ.లక్ష చెల్లిస్తే వారికి ముందుగా రూ.70 వేల విలువైన వాచ్ ఇచ్చి, రూ 15 వేల జీతం, అదనపు అలవెన్సులతో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున తీసుకున్నారు. కొందరికి వాచ్లు అందించి ఈ వాచీ పెట్టుకొని చందానగర్ గంగారంలో కొనసాగుతున్న విహన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థకు వస్తే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మీరు ఒక్కొక్కరు ముగ్గురి చొప్పున డ[బ్బులు కట్టేట్లు చేస్తే మరింతగా సదుపాయాలు, నగదు వస్తాయని అన్నారు. ఆశపడ్డ 9 మంది విద్యార్థులు డబ్బులు చెల్లించారు. కానీ ఉద్యోగాలు రాలేదు. ఈ విషయమై సురేష్ను నిలదీయగా తాను సంస్థ వారికి చెల్లించాను, వారినే అడుగుదాం రండి అంటూ.. చందానగర్కు తీసుకొచ్చాడు. గంగారంలోని కార్యాలయానికి వెళ్లగా మీరు చెల్లించిన డబ్బులు మాకు అందలేదు.. శ్రీకాంత్ తీసుకున్నాడు. అతడినే అడగండి అని తెలపడంతో మోసపోయామని బాధిత విద్యార్థులు గ్రహించారు. దీనిపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొలుసుకట్టు వ్యవహారంగా ఉండటంతో ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు మోసపోయి ఉండచ్చునోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?