అలుపెరగని ఆరోగ్య సేవకులు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్టుడే
నాగారంలో ఇంటింటి సర్వేను పరిశీలిస్తున్న డీఐవో వెంకటరమణ, తదితరులు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. టీకాల పంపిణీలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నుంచి కొంత విముఖత ఎదురవుతున్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 7.93 లక్షల మందికి మొదటి డోసు (98 శాతం), 6.36 లక్షల మందికి (78 శాతం) రెండో డోసు, ఆరు వేల మందికి బూస్టర్ డోసు (10 శాతం) అందజేశారు. ఈనెల 21 నుంచి ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తున్నారు.
ప్రజల్లో మార్పు కనిపిస్తుంది: రాణి, ఏఎన్ఎం, రామారం
మొదటి, రెండో దశలో ఇంటింటి సర్వే నిర్వహించిన సమయాల్లో కంటే మూడో దశ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. సర్వేలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం టీకాలు తీసుకోని వారిని గుర్తించి శత శాతం టీకాల పంపిణీకి కష్టపడుతున్నాం.
లక్షణాలు ఉన్నవారికి కిట్లు:అర్చన, ఆశా కార్యకర్త, సూర్యాపేట
నాలుగు రోజులుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. చాలామందిలో దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అవసరమైన వారందరికీ కిట్లు అందిస్తున్నాం. గృహ నిర్బంధంలో ఉండాలని అవగాహన కల్పిస్తున్నాం. సెలవులు లేకుండా అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తోంది. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నాం.
అవగాహన కల్పిస్తున్నాం: అనిత, ఆశా కార్యకర్త, కాసరబాద్
కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సాధారణ జలుబు, జ్వరాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ను వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నాం. ఇబ్బందులు ఎదురవుతున్నా.. పట్టించుకోకుండా పనిచేసుకుంటూ వెళ్తున్నాం.
ఇబ్బందులు ఎదురైనా పనిచేస్తున్నాం: సంధ్య, ఏఎన్ఎం, తాళ్లఖమ్మంపహాడ్
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగ బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పగించిన విధులను పూర్త చేస్తున్నాం. ప్రభుత్వం మా సమస్యలనూ పరిష్కరించాలి.
నాలుగు రోజులుగా జిల్లాలో సర్వే వివరాలు:
జిల్లాలో ఏఎన్ఎంలు : 309 మంది
ఆశా కార్యకర్తలు : 1,035 మంది
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 22
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 4
గ్రామ పంచాయతీల సంఖ్య : 475
సర్వే పూర్తయిన నివాసాలు : 93,748
కొవిడ్ లక్షణాలు కలిగినవారు : 2,391 మంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..