అన్వితారెడ్డితో జిల్లాకు గుర్తింపు: కలెక్టర్
ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్వితారెడ్డి జిల్లాకు గుర్తింపు తెచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం తన చాంబర్లో సన్మానించి మాట్లాడారు
అన్వితారెడ్డిని సన్మానిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, తదితరులు
భువనగిరి, న్యూస్టుడే: ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్వితారెడ్డి జిల్లాకు గుర్తింపు తెచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం తన చాంబర్లో సన్మానించి మాట్లాడారు. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన ఇద్దరు మహిళల్లో ఒకరు జిల్లాకు చెందినవారు కావడం గర్వంగా ఉందన్నారు. పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ముందు తల్లిదండ్రులు.. తర్వాత ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. తల్లి అంగన్వాడీ టీచర్, తండ్రి వ్యవసాయం చేస్తూ తమ ఇద్దరు కూతుళ్లలో ఒకరిని ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అన్వితారెడ్డి తల్లి చంద్రకళ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, స్వరాజ్యం పాల్గొన్నారు.
పునరావాస పనులు వేగవంతం చేయండి
భువనగిరి: నృసింహసాగర్ జలాశయం నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న తిమ్మాపూర్ నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా హుస్సేనాబాద్లో నిర్మించనున్న కాలనీని కలెక్టర్ పమేలా సత్పతి గురువారం పరిశీలించారు. జరుగుతున్న పనులను చూసి సూచనలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీగా అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్ డీఈ గిరిధర్కు సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలునాటి పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు.
ఆరోగ్య ఉపకేంద్రాల తనిఖీ
యాదగిరిగుట్ట అర్బన్: మండలంలోని మల్లాపురం, గౌరయిపల్లి గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం తనిఖీ చేశారు. గౌరాయిపల్లి ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలు రోగులకు అందుబాటులో ఉండడంతో సిబ్బందిని ప్రశంసించారు. ఆరోగ్య కేంద్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్లు సిబ్బంది కలెక్టర్ దృష్టి తీసుకెళ్లడంతో గ్రంథాలయంలోకి ఆరోగ్య కేంద్రాన్ని మార్చేలా చర్యలు తీసుకోవాలని సర్పంచికి సూచించారు. మల్లాపురంలోని ఐకేపి కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కోనుగోలు దస్త్రాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు