గవర్నరుగా రఘుబర్ దాస్
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా అగ్రనేత రఘుబర్ దాస్ ఒడిశా 26వ గవర్నరుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. 1955 మే 3న జంషెడ్పూర్ (ఝార్ఖండ్)లో జన్మించిన ఆయన 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
భువనేశ్వర్, న్యూస్టుడే: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా అగ్రనేత రఘుబర్ దాస్ ఒడిశా 26వ గవర్నరుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. 1955 మే 3న జంషెడ్పూర్ (ఝార్ఖండ్)లో జన్మించిన ఆయన 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో జనతా పార్టీలో ఉన్న ఆయన 1980లో భాజపాలో చేరారు. 1995 నుంచి అయిదుసార్లు జంషెడ్పూర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో ఝార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన ఆయన 2014-19లో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం భాజపా కేంద్ర శాఖ ఉపాధ్యక్షునిగా ఉన్న ఆయనకు గవర్నరు పదవి వరించింది. బీఎస్సీ, బీఎల్ చదివిన దాస్ రాజకీయాల్లోకి రాక ముందు జంషెడ్పూర్లోని టాటా స్టీల్ రోలింగ్ మిల్లో పనిచేశారు.
ప్రజల హృదయాల్లో నిలిచిన గణేశీలాల్
రాజ్యాంగ పరిధిలో ఉన్న గవర్నర్లు రాజ్భవన్లకే పరిమితంగా ఉంటారని, ప్రజలకు దూరంగా ఉంటారన్న వాదనలకు భిన్నంగా ఆచార్య గణేశీలాల్ రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మీయునిగా నిరూపించుకున్నారు. 2018 మే 25న గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీ కాలం (అయిదేళ్లు) ఈ ఏడాది మే 29న ముగిసింది. తర్వాత కేంద్రం వ్యవధి పొడిగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన హరియాణావాసి. ప్రముఖ వర్సిటీల్లో ఆచార్యునిగా గతంలో విధులు నిర్వహించారు. ఆరెస్సెస్తో సన్నిహిత సంబంధాలున్న ఆయన హరియాణ ఏబీవీపీ అధ్యక్షునిగా, కేంద్ర భాజపా క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా విధులు నిర్వహించారు. 1976 ఎమర్జన్సీలో కొన్నాళ్లు కారాగారంలో ఉన్నారు. సిర్సా అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎన్నికైన ఆయన మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఒడిశాలో గణేశీలాల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్భవన్కే పరిమితం కాకుండా ప్రజల మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కులపతి (ఛాన్స్లర్) హోదాలో విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు సందర్శించి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లో ఒడియా భాష నేర్చుకున్న ఆయన జగన్నాథుని ప్రియభక్తునిగా ముద్రపడ్డారు. సంగీత, సాహిత్య రంగాల్లో ప్రావీణ్యం గల ఆయన తన పదవీ కాలంలో వివాదాల జోలికి వెళ్లలేదు. అధికార, విపక్షాల నాయకులందరి మన్ననలు అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలు బహిష్కరించిన గుడియాపట్నా గ్రామస్థులు
[ 20-05-2024]
ఒడిశాలోని గంజాం జిల్లా కన్నొకెముండి అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని గుడియా పట్నా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. -
చెట్టును ఢీకొట్టిన మినీ ట్రక్.. డ్రైవర్ మృతి
[ 20-05-2024]
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి సమీపంలోని పుకిలి కూడలి వద్ద ఓ మినీ ట్రక్ అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. -
రెండో విడత పోలింగ్.. ప్రిసైడింగ్ అధికారిణికి అస్వస్థత
[ 20-05-2024]
ఒడిశాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సుందర్గఢ్ జిల్లాలోని 211వ పోలింగ్కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిణి అస్వస్థతకు గురై కింద పడిపోయారు. -
నేడు రెండో విడత పోలింగ్
[ 20-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
33 వేల మంది పోలీసులతో బందోబస్తు
[ 20-05-2024]
రాష్ట్రంలో రెండోవిడత పోలింగ్ నేపథ్యంలో 33 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. -
రాష్ట్రాభివృద్ధే మా అజెండా: నవీన్
[ 20-05-2024]
రాష్ట్రాభివృద్ధే అజెండాగా తాము ముందుకెళుతున్నామని, విపక్షాల మాదిరిగా ఆడి తప్పబోమని, చెప్పింది చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. -
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు