దారి మళ్లించి దోపిడీ
సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయం. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన డోలా శ్రీనివాసరావు ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగారు. ఆర్టీసీ
ఆటోడ్రైవర్ల ముసుగులో అరాచకం
వెంటాడి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు
బాధితుడు డోలా శ్రీనివాసరావు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయం. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన డోలా శ్రీనివాసరావు ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగారు. ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. అప్పటికే అందులో మరో ఇద్దరు యువకులున్నారు. ఆటో కలెక్టర్ బంగళా మీదుగా ట్రంకురోడ్డులోకి వచ్చింది. అటు నుంచి పాత మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉండగా.. దక్షిణ బైపాస్ వైపు డ్రైవర్ దారి మళ్లించాడు. విషయాన్ని గుర్తించిన నరసింహారావు అదేంటని అతన్ని ప్రశ్నించారు. మిగిలిన ఇద్దరినీ బైపాస్లో దించేసి బస్టాండ్కు వెళ్దామని నమ్మబలికాడు. అందుకు అతను ససేమిరా అనడంతో అప్పటికే అందులో ఉన్న యువకులు అతన్ని కత్తితో బెదిరించి బలవంతంగా కూర్చోబెట్టారు. ఆటోను టంగుటూరు వైపు తీసుకెళ్లారు. సంఘమిత్ర దాటిన తర్వాత శ్రీనివాసరావుపై దాడి చేసి రూ.7,500 నగదు, సెల్ఫోన్ లాక్కున్నారు. అనంతరం అతన్ని దించకుండానే వెళ్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు సూరారెడ్డిపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఆటోలో నుంచి రోడ్డు మీదకి దూకేశారు. సమీపంలో ఉన్న హైవే మొబైల్ పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను వెంబడించారు. తూర్పు నాయుడుపాలెం వద్ద ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లి ఆటోకు అడ్డుగా తమ వాహనాన్ని నిలిపారు. ఈ ఉదంతంతో నిందితులు పోలీసు వాహనానికి ఆటోను కాస్త దూరంలో నిలిపి పరారయ్యారు. ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని టంగుటూరు స్టేషన్కు తరలించారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. ఆటో ఆధారంగా నిందితులు ఒంగోలు అరవ కాలనీకి చెందిన యువకులుగా గుర్తించారు. వారిలో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. -
ఆటల్లోనూ జగన్నాటకం
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు