దారి మళ్లించి దోపిడీ
సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయం. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన డోలా శ్రీనివాసరావు ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగారు. ఆర్టీసీ
ఆటోడ్రైవర్ల ముసుగులో అరాచకం
వెంటాడి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు
బాధితుడు డోలా శ్రీనివాసరావు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయం. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన డోలా శ్రీనివాసరావు ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగారు. ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. అప్పటికే అందులో మరో ఇద్దరు యువకులున్నారు. ఆటో కలెక్టర్ బంగళా మీదుగా ట్రంకురోడ్డులోకి వచ్చింది. అటు నుంచి పాత మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉండగా.. దక్షిణ బైపాస్ వైపు డ్రైవర్ దారి మళ్లించాడు. విషయాన్ని గుర్తించిన నరసింహారావు అదేంటని అతన్ని ప్రశ్నించారు. మిగిలిన ఇద్దరినీ బైపాస్లో దించేసి బస్టాండ్కు వెళ్దామని నమ్మబలికాడు. అందుకు అతను ససేమిరా అనడంతో అప్పటికే అందులో ఉన్న యువకులు అతన్ని కత్తితో బెదిరించి బలవంతంగా కూర్చోబెట్టారు. ఆటోను టంగుటూరు వైపు తీసుకెళ్లారు. సంఘమిత్ర దాటిన తర్వాత శ్రీనివాసరావుపై దాడి చేసి రూ.7,500 నగదు, సెల్ఫోన్ లాక్కున్నారు. అనంతరం అతన్ని దించకుండానే వెళ్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు సూరారెడ్డిపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఆటోలో నుంచి రోడ్డు మీదకి దూకేశారు. సమీపంలో ఉన్న హైవే మొబైల్ పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను వెంబడించారు. తూర్పు నాయుడుపాలెం వద్ద ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లి ఆటోకు అడ్డుగా తమ వాహనాన్ని నిలిపారు. ఈ ఉదంతంతో నిందితులు పోలీసు వాహనానికి ఆటోను కాస్త దూరంలో నిలిపి పరారయ్యారు. ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని టంగుటూరు స్టేషన్కు తరలించారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. ఆటో ఆధారంగా నిందితులు ఒంగోలు అరవ కాలనీకి చెందిన యువకులుగా గుర్తించారు. వారిలో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యమా! జె గ్యాంగ్ సామ్రాజ్యమా
[ 09-05-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో అరాచక పర్వం రాజ్యమేలింది. అన్యాయంపై ఎవరూ నోరెత్తకూడదు. బాధితులు అదేమని అడగకూడదు. హామీలు అమలు చేయాలంటూ నిరసన ప్రదర్శనలు చేయకూడదు. -
ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు
[ 09-05-2024]
రవీ.. నా అంతట నేనే చెబుతున్నాను. మహేషో., దుర్గారెడ్డో., కుమ్మిత అంజిరెడ్డినో నమ్మి అయితే మేము ఎలక్షన్ చేయట్లా.. నేను నీకు చెబుతున్నాను గుర్తుపెట్టుకో.. నేనుగానీ, సార్గానీ, పెద్దామెగానీ దర్శి నాయకులను పెట్టుకుని ఎలక్షన్ చేయట్లేదు. -
పేదలపై నిర్దయ.. నిస్సిగ్గుగా బీమాయ
[ 09-05-2024]
మండుటెండైనా.. కుండపోత వానైనా.. స్వేదం చిందిస్తేనే గానీ పూట గడవని పేద బతుకులెన్నో! అలాంటి శ్రమజీవుల కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోతే బాధితుల వేదన అంతా ఇంతా కాదు..మాటలకందని అలాంటి పెను విషాదం వేళ..వారి వేదనను కొంతైనా దూరంచేసేందుకు ఉపక్రమించారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు. -
చంద్రన్న రాగానే ముస్లింలకు పింఛన్లు
[ 09-05-2024]
మైనార్టీల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని, చంద్రబాబు అధికారంలోకి రాగానే యాభై ఏళ్లు దాటిన ముస్లింలందరికీ పింఛన్లు అందిస్తారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ తెలిపారు. -
చెరువులు కాదయ్యా.. మన జగనన్న రోడ్లు
[ 09-05-2024]
చిన్నపాటి వర్షానికి రాచబాటలు చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీ వర్షం పడినా చినుకు నిలవకుండా రహదారుల నిర్మాణం చేపట్టాలి. -
సార్వత్రిక ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు, సమగ్ర పర్యవేక్షణ ఎంతో కీలకమని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. స్థానిక ప్రకాశం భవన్ నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. -
జీతాలు తీసుకుంటూ.. వైకాపా సేవలో తరిస్తూ..
[ 09-05-2024]
ప్రభుత్వం నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్న ఉద్యోగులు రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలన్న నిబంధనను కొందరు పెడచెవిన పెడుతున్నారు. -
సకుటుంబ సమేత
[ 09-05-2024]
పశ్చిమంలో తమ హయాంలో నయీం సోదరులుగా పేరొందిన ఆ సోదరద్వయం సాధించిన అరుదైన ఘనత. వాళ్లిద్దరే కాదు, ఆ ఎమ్మెల్యేకు పిల్లనిచ్చిన మామ, మేనత్త కుటుంబాలు సాగించిన అక్రమాలు అనేకం. -
ఫారెస్ట్ సర్వీస్లో తెలుగువారి సత్తా
[ 09-05-2024]
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. -
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
[ 09-05-2024]
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. మన నీడ ‘మాయం’ అవుతుంది! ఇలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. -
జీతం నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి.. సేవలు నరసరావుపేటలో వైకాపాకు!
[ 09-05-2024]
నెల్లూరు నగరపాలకసంస్థలో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులు వారికి కేటాయించిన విధులను విస్మరించి వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. -
మరో రెండు రోజులు వర్షాలు!
[ 09-05-2024]
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. -
సికింద్రాబాద్ నుంచి ఏపీ, ఒడిశాలకు ప్రత్యేక రైళ్లు
[ 09-05-2024]
సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్కు 2రోజులపాటు 2ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు ఇవి (07129, 07131) సికింద్రాబాద్ నుంచి బయలుదేరతాయి.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్