Andhra News: సినీఫక్కీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అపహరణ
తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు
పోలీసులకు వివరాలు చెబుతున్న బాధితుడు ఈశ్వరరావు
‘మీ ఇంటికి ఫోన్ చేసి రూ.50 లక్షలు తెమ్మని చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారు. సొమ్ము తేకుంటే మా పెద్ద సారుకు అప్పగిస్తామని, ఆయన నీ శరీర అవయవాలు అమ్మేస్తాడని భయపెట్టారు.’ ఇంతలో ఉద్యోగి కేకలు వేయడంతో స్థానికులు విని దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎస్.కోటలో చోటుచేసుకుంది.
శృంగవరపుకోట, తెర్లాం, న్యూస్టుడే తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కారు ఆగిపోయింది, సహకరించాలని కోరగా వెనుక నుంచి కారు నెడుతున్న ఈశ్వరరావుపై కర్రతో దాడి చేసి, కాళ్లు, చేతులు కట్టేశారు. నలుగురిలో ఒకరు అక్కడ ఉండిపోయి ముగ్గురు వ్యక్తులు అదే కారులో ఎస్.కోట మండలం ధర్మవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణం పక్కన ఉన్న వాటర్ ప్లాంటు వద్దకు తీసుకొచ్చారు. లోపలికి ఈశ్వరరావును తీసుకెళ్తుండగా రక్షించండంటూ కేకలు వేశాడు. స్థానికులు చేరుకుని ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒకరు పరారయ్యాడు. పారిపోయిన వ్యక్తి వాటర్ ప్లాంటు నిర్వహిస్తున్న ఎస్.కోట మండలం రేవళ్లపాలేనికి చెందిన రాజశేఖర్గా, పట్టుబడిన వారు ఇతని వద్ద వాహన చోదకులు రేవళ్లపాలేనికి చెందిన గేదెల సత్యనారాయణ, ఎస్.కోటకు చెందిన అంబటి మోహనరావుగా గుర్తించామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.
అపహరణకు వినియోగించిన కారు
డబ్బుల కోసమే...
కునాయవలసలో తన ఇంటికి సమీపంలో ఉంటున్న కరుణాకర్ స్నేహితులతో కలసి డబ్బుల కోసమే ఈ పథకం పన్నాడని బాధితుడు చెప్పినట్లు ఎస్సై తెలిపారు. తీవ్ర గాయాలైన ఈశ్వరరావును ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స చేయించగా వైద్యులు విజయనగరం రిఫర్ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఘటన తెర్లాం పోలీసు స్టేషను పరిధిలో జరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడికి కేసు బదిలీ చేయాలా, లేక ఇక్కడే దర్యాప్తు చేయాలా అన్నది నిర్ణయిస్తామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిరిజనులకు అండగా ఉంటా: మంత్రి
[ 18-06-2024]
గిరిజనులకు విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. -
వారధి పాపం.. ఆ పాలకులదే..!
[ 18-06-2024]
వేగావతి నదిపై పారాది వద్ద వైకాపా హయాంలో రూ.కోటితో నిర్మించిన కాజ్వే ఎందుకూ పనికిరాకుండా పోయింది. గత రెండు రోజులు కురిసిన చిన్నపాటి వర్షానికే నదిలో ప్రవాహం పెరిగి.. మూడు నెలల క్రితం నిర్మించిన నిర్మాణం కొట్టుకుపోయింది. -
కన్నేసి.. వాలేసి
[ 18-06-2024]
భూమి లేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై పెద్దలు కన్నేసి గద్దల్లా వాలిపోయారు. గత ప్రభుత్వం అసైన్డ్ భూములకు యజమాన్య హక్కు కల్పించనుందని తెలిసి వాటి అమ్మకాలు, కొనుగోళ్లు చట్ట ప్రకారం చెల్లవని తెలిసినా అనధికార లావాదేవీలతో గుంజుకున్నారు. -
ప్రక్షాళన జరగాలి.. సహకారం అందాలి!!
[ 18-06-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) రైతులే సభ్యులు. గతంలో సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారే పాలకవర్గాలను ఎన్నుకునేవారు. దీంతో మెరుగైన సేవలు అందేవి. -
పారిశ్రామికవాడ అభివృద్ధికి కృషి
[ 18-06-2024]
బొబ్బిలి పారిశ్రామికవాడ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొబ్బిలి కోటకు సోమవారం తొలిసారిగా వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా స్వాగతం పలికారు. -
అందరికీ అందుబాటులో ఉంటాం
[ 18-06-2024]
పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లా కేంద్రం మీదుగా శ్రీకాకుళానికి వెళ్తున్న అమాత్యులకు నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శ్రేణులు వారికి అభినందనలు తెలిపాయి. -
వైకాపా విధానాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 18-06-2024]
పట్టణవాసుల నెత్తిపై బండలా మారిన చెత్తపన్నును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈమేరకు అన్ని జల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘంలో పన్ను విధించేవారు. -
గెడ్డగూడ ఘాట్లో వ్యాన్ బోల్తా
[ 18-06-2024]
సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృత్యువాత
[ 18-06-2024]
అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ వివరాల మేరకు.. స్థానిక బంగారమ్మ కాలనీకి చెందిన అనూష అలియాస్ తనూజ(22)కు నాలుగు నెలల కిందట వివాహమైంది. -
రైలు ప్రమాదంలో తెగిపడిన కాళ్లు
[ 18-06-2024]
అనుకోని ప్రమాదంలో ఓ వ్యక్తి తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలిసేలోపే తన శరీరం నుంచి తెగిపడడంతో అతడి రోదన వర్ణనాతీతంగా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను ఆమెలా ఉంటా.. అందుకే బాలీవుడ్లో అవకాశాలు: తాప్సీ
-
అక్రమ కేసులు రద్దు చేయాలి: లోకేశ్కు సీపీఎస్ ఉద్యోగుల విజ్ఞప్తి
-
నీట్ వివాదంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారు?
-
ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
-
ఆల్టైమ్ గరిష్ఠాలకు సూచీలు.. 23,500 ఎగువన ముగిసిన నిఫ్టీ
-
పోలవరాన్ని జగన్ అధోగతి పాల్జేశారు: ఎమ్మెల్సీ అనురాధ