ఆర్టీసీ గల్లాపెట్టె గలగల!
ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచుకునే ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి వంద రోజుల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చివరి సోమవారమైన ఈ నెల 27న రీజియన్కు రూ.2కోట్ల ఆదాయం.....
న్యూస్టుడే, హనుమకొండ చౌరస్తా
ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచుకునే ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి వంద రోజుల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చివరి సోమవారమైన ఈ నెల 27న రీజియన్కు రూ.2కోట్ల ఆదాయం తీసుకురావాలని లక్ష్యం నిర్దేశించుకుని ‘మండే ఛాలెంజ్’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టారు. వరంగల్ రీజియన్లోని సిబ్బంది, అధికారులు 100 శాతం కృషి ఫలితంగా లక్ష్యాన్ని మించి రూ.2.01కోట్ల ఆదాయం తీసుకువచ్చారు. ఆషాడమాసం, విద్యాసంస్థలు తెరుచుకోవడంతో పాటు అధికారులు ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్డ్ ప్రకారం అన్ని రూట్లలో బస్సులను నడిపించారు. అన్ని పాయింట్ల వద్ద సిబ్బందిని ఉంచి ప్రయాణికుల అవసరం మేరకు సర్వీస్లు నడిపించి అనుకున్న ఆదాయం సంపాదించారు. సాధారణంగా వరంగల్ రీజియన్ నుంచి నిత్యం 980 బస్సులు వివిధ ప్రాంతాలకు నడిస్తే రోజుకు రూ.కోటి నుంచి రూ.1.20కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అలాంటిది సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా ఆదాయం రూ.2కోట్లు దాటడం గమనార్హం. ఇందులో కేవలం టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.84 కోట్లు, సెస్, ఇతర సేవల ద్వారా వచ్చిన ఆదాయం రూ.16,79,885గా ఉంది.
అధికారులు, సిబ్బంది కృషితోనే.. : - వి.శ్రీదేవి, రీజనల్ మేనేజర్
ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని అన్ని డిపోల అధికారులు, సిబ్బ ంది సమష్టి కృషితోనే ఈ విజయం సాధించాం. ఉద్యోగులు సంస్థ ఆదాయం పెంచడానికి పోటీపడ్డారు. రానున్న రోజుల్లో మరిన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఇదే స్ఫూర్తితో పని చేసి ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ సంస్థ ఆదాయాన్ని పెంచుతూ ప్రయాణికులకు మరింత సురక్షితమైన, నమ్మకమైన సేవలను అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు