భగ్గుమన్న ఉద్యోగులు!
ఉద్యోగులు, పింఛను దారులకు నష్టం చేకూర్చేలా ఉన్న 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, పోలవరం, తణుకు తదితర ప్రాంతాల్లో గురువారం ఆందోళనలు,
కొయ్యలగూడెంలో ఆందోళన చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది
ఉద్యోగులు, పింఛను దారులకు నష్టం చేకూర్చేలా ఉన్న 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, పోలవరం, తణుకు తదితర ప్రాంతాల్లో గురువారం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పలు చోట్ల జీవో ప్రతులకు దహనం చేశారు. పీఆర్సీల చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. వీరికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి. - న్యూస్టుడే, నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు, పోలవరం, తణుకు
ఏలూరులో గృహ నిర్బంధంలో ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్ హరనాథ్
నాయకుల గృహ నిర్బంధం
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: కొత్త పీఆర్సీ జీవోలపై నిరసన కార్యక్రమానికి వెళ్లనీయకుండా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్ ఆర్.ఎస్. హరనాథ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణను ఏలూరులో, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోపిమూర్తిని భీమవరంలో గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో గురువారం నిర్వహించిన ఐకాస రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వీరికి అవకాశం లేకుండా చేశారు.
కలెక్టరేట్ వద్ద ....
పోలీసుల మోహరింపు
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో పోలీసులు ఎక్కడికక్కడ మోప ారించారు. పాతబస్టాండ్ సెంటరు, తంగెళ్లమూడి, ఫైర్స్టేషన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ వద్ద ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ఆదేశాల మేరకు ఏలూరు ఏఎస్పీ, ఏలూరు ఇన్ఛార్జి డీఎస్పీ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగ సంఘాల నేత హరినాథ్ను ఆయన నివాసం వద్ద పోలీసులు గృహ నిర్బంధం చేయటంతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.
ఐటా మద్దతు
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఫ్యాప్టో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడికి ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ (ఐటా) సంపూర్ణ మద్దతు తెలిపింది. ముట్టడిలో ఐటా రాష్ట్ర అధ్యక్షుడు యస్. అబ్దుల్ రజాక్, జిల్లా అధ్యక్షుడు రిజ్వాన్ అహమ్మద్, కార్యదర్శి యం.డి.ముజాహిద్ పాల్గొన్నారు.
అరెస్టులు అప్రజాస్వామికం
ఏలూరు టూ టౌన్, న్యూస్టుడే: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలటూ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టులు చేయటం అప్రజాస్వామ్యకమని పంచాయితీరాజ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు జి శ్రీధర్ రాజు, కార్యదర్శి గోపాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పీఆర్సీ 2020 ప్రక్రియలో పాల్గొనొద్దు
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఏపీటీఎస్ఏ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పీఆర్సీ 2020 ప్రక్రియలో ఖజానా ఉద్యోగులు పాల్గొనరాదని జిల్లా అధ్యక్షుడు యు.వి. పాండురంగారావు, కార్యదర్శి కె. సత్యనారాయణ ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర సంఘానికి మద్దతుగా ఒకే మాట ఒకే బాటగా ఉండాలని, అధికారుల నుంచి ఏవిధమైన ఒత్తిడి వచ్చిన జిల్లా నాయకత్వానికి తెలియచేయాలని కోరారు.
నరసాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద పింఛనుదారుల సంఘ సభ్యుల..
కొవ్వూరులో జీవో ప్రతుల దహనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..