Eluru: ప్రియురాలి హత్య.. ఆపై ఆత్మహత్య
వివాహేతర సంబంధాలు, అడ్డూఅదుపూ లేని జీవితాలు చివరకు ఇలా అర్ధంతరంగా ముగుస్తాయి అనే దానికి ఏలూరు నగరంలో జరిగిన ఘటనే నిదర్శనం.
తనను నిర్లక్ష్యం చేస్తోందనే అక్కసుతో దారుణం
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: వివాహేతర సంబంధాలు, అడ్డూఅదుపూ లేని జీవితాలు చివరకు ఇలా అర్ధంతరంగా ముగుస్తాయి అనే దానికి ఏలూరు నగరంలో జరిగిన ఘటనే నిదర్శనం. కొంతకాలం తనతో సఖ్యతగా ఉండి ఆ తరువాత నిర్లక్ష్యం చేస్తోందనే కారణంగా ఆమెను హతమార్చాడు. తరువాత పోలీసులు పట్టుకుంటారనో.. ఇక జీవితం ముగించాలనో అతను కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు దక్షిణపు వీధి అశోక్ చక్రం ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో మహిళ హత్యకు గురైంది. కత్తితో పీక కోసి చంపేశారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ రాజశేఖర్ ఆదేశాల మేరకు ఎస్సై రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించారు. నగర శివారు శనివారపుపేటకు చెందిన ఉడతా సుజాత(30)గా గుర్తించారు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది.. ఎవరు చంపారు.. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆమె మృతి చెందిన ఇంట్లో దిమ్మిటి సత్యనారాయణ(40) నివాసముంటున్నాడు. అతనికి వివాహమైనా భార్యతో విభేదాలు రావడంతో అయిదేళ్ల కిందట వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. హత్యకు గురైన సుజాత నాలుగేళ్లుగా అతనితో సన్నిహితంగా ఉంటోందని, అప్పుడప్పుడూ వచ్చివెళ్తుందని స్థానికులు కొందరు చెప్పడంతో పోలీసులకు విషయం అర్థమైంది.
నూజివీడు సమీపంలో రైలు కింద పడి..
తనతో సన్నిహితంగా ఉండే సుజాతను సత్యనారాయణ కత్తితో పీక కోసి చంపాడు. ఆదివారం రాత్రి తన ఇంటికొచ్చిన ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న సుజాతను అక్కడే వదిలేసి సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. పోలీసులకు దొరికిపోతానేమోనని భయపడ్డాడు. అలా నూజివీడు సమీపంలోకి చేరుకున్నాక రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బ్రిడ్జి కింద తన ద్విచక్ర వాహనం పెట్టి పట్టాలు వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అతని జేబులో ఓ చీటీపై పేరు, చిరునామా ఉండటంతో వివరాలు తెలుసుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని, అతని జేబులో ఉన్న చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
విషయాన్ని సూసైడ్ నోట్లో రాసి..
సుజాత తనను కొద్ది రోజులుగా దూరం పెడుతోందని.. గతంలో బాగానే ఉండేదని.. ఆమెకు తాళి కూడా కట్టానని సత్యనారాయణ సూసైడ్ నోట్లో రాశాడు. కొద్ది రోజులుగా అవమానిస్తోందని, అందుకే ఆదివారం రాత్రి నమ్మకంగా ఇంటికి పిలిపించుకుని ఈ విధంగా చేశానని పేర్కొన్నాడు. దాన్ని పోలీసులు ఇంట్లో గుర్తించారు. తొలుత సత్యనారాయణ మృతి విషయాన్ని అతని బంధువులకు రైల్వే పోలీసులు చెప్పడంతో అతని నివాసానికి వెళ్లిచూశారు. లోపల సుజాత మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. తాళాలు పగులకొట్టిన పోలీసులు లోపల రక్తపు మడుగులో ఉన్న సుజాత మృతదేహాన్ని, పక్కనే ఉన్న కత్తిని పరిశీలించారు. ఆ పక్కనే కిటికీలో ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే సుజాతను చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్నారు.
సుజాత నేపథ్యం ఇదీ..
సుజాతకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. శనివారపుపేటలో నివాసం ఉంటున్నారు. భర్త లారీ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతను, సత్యనారాయణ స్నేహితులు. ఈ కారణంగానే సుజాతకు, సత్యనారాయణకు పరిచయం ఏర్పడింది. భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు సుజాత సత్యనారాయణ ఇంటికి వెళ్లి వస్తుంటుంది. లారీ డ్రైవర్ ఈ నెల 23న భోపాల్ వెళ్లారు. అతనికి పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. సుజాతకు సత్యనారాయణకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. అతను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానిపై లోతుగా విచారణ చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ రాజశేఖర్ ఆదేశాల మేరకు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
-
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి