పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యం!
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు.
తెదేపా ఏజెంట్లను లొంగదీసుకునే ఎత్తులు
లేదంటే ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రలు
దాడులు, ఎదురు కేసులు పెట్టేందుకు యత్నాలు
50 శాతం పోలింగ్ కేంద్రాల్లో ఇదే వ్యవహారం
పులివెందుల
ఈనాడు, కడప: సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు. దౌర్జన్యంగా ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకునే కుతంత్రాలు సాగిస్తారు. ఓటరు తన అభిప్రాయం మేరకు ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణం ఉండదు. వైకాపా నేతల గుప్పిట్లో పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ లింగాల గ్రామంలో తెదేపా ఏజెంట్లపై దాడి జరిగింది. గత అనుభవాలతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- పులివెందులలో వైకాపా మినహా ఇతర పార్టీలు స్వేచ్ఛగా ప్రచారం నిర్వహించుకునే పరిస్థితుల్లేవు. గతేడాది సెప్టెంబరు 8న తెదేపా అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా గండికోట ప్రాజెక్టు సందర్శించి పులివెందుల నుంచి అనంతపురం వెళుతుండగా అంబకపల్లెలో తెదేపా కార్యకర్త నాగరాజు బాణసంచా కాల్చారనే కారణంగా అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
- ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు షర్మిల లింగాల గ్రామానికి ఎన్నికల ప్రచానికి వెళ్లిన సమయంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వివేకా కుమార్తె సునీతకు అడ్డంకులు సృష్టించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పలుసార్లు విజ్ఞప్తులు చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
- లింగాల మండలం లింగాల, తాతిరెడ్డిపల్లె, రామన్నూతనపల్లె, చిన్నకుండాల, అంబకంపల్లె, మురారిచింతల, కోమన్నుతుల, దిగువపల్లె, ఎగువపల్లెలో వైకాపా తప్ప ఇతర పార్టీల ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదు. ఏజెంట్ ఫారాలు తీసుకొచ్చిన వ్యక్తిని ప్రలోభాలతో లోబర్చుకునే ప్రయత్నం చేస్తారు.
- పులివెందుల మండలపరిధిలో పెద్ద రంగాపురం, ఎర్రగుడిపల్లె, నగిరిగుట్ల పోలింగ్ కేంద్రాలను గతంలో వైకాపా తమ స్వాధీనం చేసుకుని గుండాగిరితో ఎన్నికలు జరిపించారు. నాలుగు రోజుల కిందట పెద్ద రంగాపురం గ్రామానికి సునీత ఎన్నికల ప్రచారానికి వెళ్లగా వైకాపా మూకలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
- సీఎం జగన్ స్వగ్రామం సింహాద్రిపురం మండలం బలపనూరులో ఏ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా తప్ప ఇతరులు ఏజెంట్గా కూర్చోవడానికి లేదు. 2019 ఎన్నికల్లో తెదేపా ఏజెంట్గా కూర్చున్న వ్యక్తి మోటారు పైపులు కత్తిరించి బోరులోకి పడిపోయేలా చేస్తామని హెచ్చరిస్తారు. దీంతో తెదేపా ఏజెంట్ ఉదయం 10 గంటల తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి వెనక్కి వచ్చేశారు.
- నియోజకవర్గంలో 2,29,687 మంది ఓటుహక్కును వినియోగించుకోవడానికి 301 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో 124 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక, 118 వరకు సమస్యాత్మకమైనవిగా గుర్తించినప్పటికీ ప్రజాస్వామ్యయుత ఎన్నికలకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో 14 నియోజక వర్గాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కు చర్యలు తీసుకోగా, ఇక్కడ లేకపోవడం గమనార్హం.
- నియోజకవర్గంలో దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం గొడవలు జరుగుతున్నాయి. పోల్కాని ఓట్లను దొంగ ఓట్లుగా వేయడానికి వైకాపా ప్రయత్నించడం, తెదేపా ఏజెంట్లు అడ్డుకోవడం, ప్రతిగా దాడులు చేయడం షరామామూలుగా మారాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి అల్లర్లు చెలరేగడం జరుగుతోంది.
- ప్రతిపక్షాల ఏజెంట్లను ముందుగానే గుర్తించి వారిని ప్రలోభాలకు గురిచేసేందుకు అన్ని రకాలు ఎత్తులు వేస్తారు. మొండిగా పోలింగ్ కేంద్రంలో కూర్చోవడానికి ప్రయత్నించే పక్షంలో వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, కుటుంబ సభ్యుల్ని బెదిరించడం వంటి ఘటనలు గతంలో జరిగినా.. అడ్డుకునే దిశగా, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపిస్తామనే భరోసా ఇచ్చే ప్రయత్నాలు నియోజకవర్గంలో జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోతలు.. కొత్త ఆశలు!
[ 18-06-2024]
కర్షకుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై గత వైకాపా ప్రభుత్వం అంతులేని అలసత్వం చూపింది. నిర్వహణకు నిధులివ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసింది. -
విస్తరణ... నత్తనడకన!
[ 18-06-2024]
ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి-చాగలమర్రి రహదారి విస్తరణ పనులు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతుండడంతో వాహనచోదకులు, ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
[ 18-06-2024]
త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ముస్లిం మత గురువు ఇనాయతుల్లా మౌలి పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల, కమలాపురంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
కలిసికట్టుగా భరతం పడదాం!
[ 18-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కడపలో సోమవారం తొలిసారిగా కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కలిసికట్టుగా రాజకీయ ప్రయాణం సాగిస్తూ అక్రమార్కుల భరతం పట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
అంటకాగితే అంతే!
[ 18-06-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించిన వివాదాస్పద అధికారులపై వేటు వేయడం ప్రారంభించింది. వైకాపాతో అంటకాగుతూ తెదేపాతో పాటు దాని మిత్రపక్షాలను ఇబ్బందులు పెట్టిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. -
కిలో టమాట రూ.80
[ 18-06-2024]
మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాట ధర అత్యధికంగా రూ.80 పలికింది. బక్రీద్ను పురస్కరించుకుని మార్కెట్కు తక్కువ కాయలు రైతులు తీసుకొచ్చారు. -
మాట తప్పని నాయకుడు చంద్రబాబు
[ 18-06-2024]
అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతూ సంతకం చేసి సీఎం చంద్రబాబునాయుడు మాట తప్పని నేతగా నిలిచారని దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి పేర్కొన్నారు. -
నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కడపకు రాక
[ 18-06-2024]
కేంద్ర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు మంగళవారం కడప నగరానికి రానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. -
విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి
[ 18-06-2024]
బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్తు హైటెన్షన్ తీగలు తగలడంతో ఓ మహిళా కూలీ మృతిచెందగా, నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో సోమవారం చోటుచేసుకుంది. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 18-06-2024]
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడలశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని ఏపీ ఎన్జీవో జిల్లా సంఘం నాయకులు సోమవారం రాయచోటిలో కలసి సత్కరించారు. -
చేపల చెరువు విషయంలో ఘర్షణ
[ 18-06-2024]
జమ్మలమడుగు మండలంలో గత కొన్నేళ్లుగా చేపల చెరువు నిర్వహిస్తున్న వైకాపా మాజీ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ సుబ్బరాయుడు, ఎన్డీఏ కూటమి నేతల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. -
కార్డుదారులకు తీపి కబురు
[ 18-06-2024]
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ఐదు హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకాలు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రుషికొండ ప్యాలెస్ గుట్టు బయటపెడతాం: మంత్రి నారా లోకేశ్
-
రేణుకాస్వామి కేసులో కొత్త మలుపులెన్నెన్నో
-
దారితప్పిన కూతురు... తండ్రిపాలిట మృత్యువు
-
24 నుంచి ఏపీ అసెంబ్లీ.. సభాపతిగా అయ్యన్నపాత్రుడు
-
నేను ఇప్పటికీ విద్యార్థినే.. మంత్రినైనా.. ఎల్ఎల్ఎం చదువుతున్నా..: సీతక్క
-
డీజే సిద్ధార్థ్ కేరాఫ్ కొకైన్