దస్తగిరి ప్రచార వాహనంపై రాళ్ల దాడి
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్, జై భీంరామ్ భారత్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ప్రచార వాహనంపై ఆదివారం సాయంత్రం పులివెందులలో అల్లరి మూకలు దాడి చేశాయి.
దస్తగిరి ఫ్లెక్సీని చింపేసిన దుండగులు
వేంపల్లె, న్యూస్టుడే : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్, జై భీంరామ్ భారత్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ప్రచార వాహనంపై ఆదివారం సాయంత్రం పులివెందులలో అల్లరి మూకలు దాడి చేశాయి. వాహనంపై ఫ్లెక్సీలు చించి వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దస్తగిరి ప్రచార వాహనం నిత్యం పట్టణంలో తిరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ముద్దనూరు రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలి మీదుగా ఆదివారం ప్రచార వాహనం వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అల్లరిమూకలను చెదరగొట్టడంతో పరారయ్యారు. వైకాపా కార్యకర్తలే ప్రచార వాహనంపై దాడికి పాల్పడ్డారని దస్తగిరి విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోతలు.. కొత్త ఆశలు!
[ 18-06-2024]
కర్షకుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై గత వైకాపా ప్రభుత్వం అంతులేని అలసత్వం చూపింది. నిర్వహణకు నిధులివ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసింది. -
విస్తరణ... నత్తనడకన!
[ 18-06-2024]
ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి-చాగలమర్రి రహదారి విస్తరణ పనులు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతుండడంతో వాహనచోదకులు, ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
[ 18-06-2024]
త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ముస్లిం మత గురువు ఇనాయతుల్లా మౌలి పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల, కమలాపురంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
కలిసికట్టుగా భరతం పడదాం!
[ 18-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కడపలో సోమవారం తొలిసారిగా కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కలిసికట్టుగా రాజకీయ ప్రయాణం సాగిస్తూ అక్రమార్కుల భరతం పట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
అంటకాగితే అంతే!
[ 18-06-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించిన వివాదాస్పద అధికారులపై వేటు వేయడం ప్రారంభించింది. వైకాపాతో అంటకాగుతూ తెదేపాతో పాటు దాని మిత్రపక్షాలను ఇబ్బందులు పెట్టిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. -
కిలో టమాట రూ.80
[ 18-06-2024]
మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాట ధర అత్యధికంగా రూ.80 పలికింది. బక్రీద్ను పురస్కరించుకుని మార్కెట్కు తక్కువ కాయలు రైతులు తీసుకొచ్చారు. -
మాట తప్పని నాయకుడు చంద్రబాబు
[ 18-06-2024]
అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతూ సంతకం చేసి సీఎం చంద్రబాబునాయుడు మాట తప్పని నేతగా నిలిచారని దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి పేర్కొన్నారు. -
నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కడపకు రాక
[ 18-06-2024]
కేంద్ర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు మంగళవారం కడప నగరానికి రానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. -
విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి
[ 18-06-2024]
బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్తు హైటెన్షన్ తీగలు తగలడంతో ఓ మహిళా కూలీ మృతిచెందగా, నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో సోమవారం చోటుచేసుకుంది. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 18-06-2024]
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడలశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని ఏపీ ఎన్జీవో జిల్లా సంఘం నాయకులు సోమవారం రాయచోటిలో కలసి సత్కరించారు. -
చేపల చెరువు విషయంలో ఘర్షణ
[ 18-06-2024]
జమ్మలమడుగు మండలంలో గత కొన్నేళ్లుగా చేపల చెరువు నిర్వహిస్తున్న వైకాపా మాజీ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ సుబ్బరాయుడు, ఎన్డీఏ కూటమి నేతల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. -
కార్డుదారులకు తీపి కబురు
[ 18-06-2024]
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ఐదు హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకాలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు గూగుల్ జెమిని యాప్.. తెలుగుతో సహా 9 భాషల్లో అందుబాటులోకి!
-
‘0.001% నిర్లక్ష్యం ఉన్నా’.. నీట్ వివాదంపై ‘సుప్రీం’ సీరియస్
-
ఎన్డీయే నేతలు కొందరు మాతో టచ్లో ఉన్నారు: రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఈనెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్
-
ఇక్సిగో లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.6,762 లాభం