Loksabha polls: రిజర్వేషన్లను భాజపా ఎప్పటికీ తొలగించదు: అమిత్ షా
లోక్సభ ఎన్నికల వేళ అధికార భజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
దిల్లీ: భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాహుల్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
యూపీలోని కాస్గంజ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘రిజర్వేషన్ల పేరుతో రాహుల్ గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన భాజపాకు ఉంటే ఇప్పటికే ఆ విధంగా చర్యలు తీసుకునే వాళ్లం. వాటిని తొలగించడానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. కానీ మోదీ రిజర్వేషన్లకు మద్దతునిస్తారు. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను భాజపా ఎప్పటికీ తొలగించదు’’ అని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయించిన రిజర్వేషన్ కోటాలో కొంత భాగాన్ని మైనారిటీ వర్గాలకు, ముఖ్యంగా ముస్లింలకు కాంగ్రెస్ కేటాయిస్తోందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని షా తెలిపారు. ఆ నాలుగు శాతాన్ని ఎవరి కోటా నుంచి కేటాయించారో ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేస్తే ‘డెమోక్రసీ డిస్కౌంట్’.. పలు రెస్టారంట్ల వినూత్న ఆఫర్!
లోక్సభ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముంబయిలోని పలు రెస్టారంట్లు వినూత్న ఆఫర్ ప్రకటించాయి. -
మోదీకి నా వంట రుచి చూపిస్తా.. దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Mamata Banerjee: ప్రధాని మోదీకి తన చేతి వంట రుచి చూపిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అసలేం జరిగిందంటే..? -
ప్రసంగాలను సరిదిద్దుకోండి.. అగ్ర నేతలకు ‘ఈసీ’ సూచన!
ఎన్నికల వేళ ఆయా పార్టీల అగ్ర నేతల నుంచి జనం మంచి ప్రసంగాలను ఆశిస్తారని.. దీంతో నాయకులు ఈమేరకు నడుచుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. -
మోదీ నామినేషన్.. ప్రతిపాదించిన ‘ఆ నలుగురు’ ఎవరో తెలుసా?
Modi Nomination: వారణాసి నుంచి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ. ఆయన పేరును నలుగురు సామాన్యులు ప్రతిపాదించారు. ఇంతకీ వారు ఎవరు? ప్రతిపాదకులుగా వారినే ఎందుకు ఎంచుకున్నారు? -
వరుసగా మూడోసారి.. వారణాసి నుంచి నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ (Modi) నేడు వారణాసి (Varanasi) నుంచి నామినేషన్ వేశారు. ఈ సమయంలో ఆయన వెంట పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీఏ నేతలు ఉన్నారు. -
మోదీ మరోసారి నెగ్గితే ఇక ఎన్నికలనేవే ఉండవు
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ నెగ్గి, కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఇక భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. -
బతుకుల్ని మార్చనున్న కాంగ్రెస్ గ్యారంటీలు
తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ (గ్యారంటీ)లతో మహిళల జీవితాలు మారిపోతాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. -
48 గంటల్లోగా ఓటింగ్ వివరాల వెల్లడిపై విచారణ 17న
లోక్సభ ఎన్నికల ప్రతి దశలోనూ ఓటింగ్ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్ శాతాల సమగ్ర సమాచారాన్ని వెల్లడించేలా ఆదేశించాలన్న పిటిషన్పై ఈ నెల 17న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. -
ముస్లింల ఓట్లు పోతాయనే అయోధ్యకు రాహుల్ రాలేదు
ముస్లిం ఓట్లు పోతాయనే భయంతోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాహుల్గాంధీ హాజరుకాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. -
నేడు మోదీ నామినేషనుకు సీఎంలు, ఎన్డీయే మిత్రులు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రధాని మోదీ మంగళవారం నామపత్రాలు దాఖలు చేయనుండగా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే మిత్రపక్షాల నేతలు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. -
కంచుకోటల్లో అంతా తానై..
ఉత్తర్ప్రదేశ్లో దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలుగా నిలిచిన రాయ్బరేలీ, అమేఠీ లోక్సభ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. -
అది పిరికివాళ్ల కూటమి
విపక్ష ఇండియా కూటమి నేతలు పిరికివాళ్లని, అందుకే పాకిస్థాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. -
నాలుగో విడతలోనూ మాకే భారీ మద్దతు: మోదీ
భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థులకు భారీ మద్దతు లభిస్తోందని, విపక్ష కూటమి కనీసం ప్రజల చర్చల్లో కూడా లేదని సోమవారం నాలుగోవిడత లోక్సభ ఎన్నికల పోలింగు ముగిసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. -
మోదీ మళ్లీ గెలవాలని శ్రీరాముడి అభిలాష
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తనకు వీరభక్తుడైన మోదీ విజయం సాధించాలని శ్రీరాముడి అభిలాష కూడా. -
నాలుగో విడతలో 67.70%
సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక విడత పూర్తయింది. నాలుగో దశలో భాగంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ సోమవారం దాదాపు ప్రశాంతంగానే ముగిసింది. -
‘రాహుల్తో చర్చకు యువమోర్చా నేతను పంపుతాం’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో బహిరంగ చర్చకు యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ను పంపుతామని, దీనిపై రాహుల్ తన సంసిద్ధతను తెలపాలని కర్ణాటకకు చెందిన భాజపా ఎంపీ తేజస్వీ సూర్య వెల్లడించారు. -
మీ హామీల అమలుకయ్యే ఖర్చెంతో తెలుసా?
కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుకు అయ్యే వ్యయం గురించి ఆ పార్టీకి తెలుసా అని భాజపా నేత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. -
స్ట్రెచర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
బిహార్కు చెందిన ఓ మహిళ నడవలేని స్థితిలోనూ తన ఓటు హక్కును వినియోగించుకుని పౌరులందరికీ ఆదర్శంగా నిలిచారు. -
మోదీకి వీడ్కోలుకు ఇక 3 వారాలే: కాంగ్రెస్
లోక్సభ ఎన్నికల్లో నాలుగో దశ ముగిసిన తర్వాత భాజపా గ్రాఫ్ మరింత తిరోగమనంలో ఉందని, దీంతో ప్రధాని మోదీ శిబిరం నైరాశ్యంలో మునిగిపోయిందని కాంగ్రెస్ పేర్కొంది. -
‘ఇండియా’ అధికారంలోకి వస్తే జూన్ 5నే బయటకు వస్తా
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే జూన్ 5నే తాను తిహాడ్ జైలు నుంచి విడుదలవుతానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. -
స్వేచ్ఛాయుత ఎన్నికలంటే ఇవా?: ఒమర్
జమ్మూకశ్మీర్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించలేదంటూ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.
తాజా వార్తలు
-
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!