Lok Sabha elections: ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం..!
Lok Sabha elections: సూరత్లో భాజపా అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో భాజపాకు తొలి విజయం లభించినట్లయ్యింది.
అహ్మదాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) అధికార భారతీయ జనతా (BJP) పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. గుజరాత్ (Gujarat)లోని సూరత్ (Surat) స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్ విజయానికి మార్గం సుగమమైంది.
సూరత్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నీలేశ్ కుంభనీ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్వో వెల్లడించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి వేసిన మరో నామినేషన్ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. మరోవైపు, ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన సోమవారం వీరంతా పోటీ నుంచి వైదొలిగారు. వీరిలో స్వతంత్రులతో పాటు బీఎస్పీ అభ్యర్థి కూడా ఉండటం గమనార్హం.
ఇక, పోటీలో ముకేశ్ దలాల్ ఒక్కరే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయన విజయంపై ఈసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ దలాల్కు అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి సూరత్ తొలి కమలాన్ని అందించింది’’ అని రాసుకొచ్చారు. అటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా దీనిపై పోస్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపా చారిత్రక విజయానికి నాంది పడిందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గుజరాత్ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం జయభేరి మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకు మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సూరత్లో ముకేశ్ దలాల్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే.. ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్లలో మాట్లాడేందుకూ ప్రజలు భయపడుతున్నారు: శశి థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అధికార భాజపాపై నిప్పులు చెరిగారు. -
ఉద్ధవ్ది ‘నకిలీ’ శివసేన: అమిత్ షా విమర్శలు
ఉద్ధవ్ ‘నకిలీ’ శివసేన నడుపుతున్నారని.. అసలైన పార్టీ శిందేతోనే ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ..!
లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్యపై లాలూ పోటీ చేస్తున్నారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. దీనివెనక ఒక ఆసక్తికర విషయం ఉంది. -
ప్రియాంకా గాంధీ.. ఎందుకు పోటీ చేయట్లేదు?
లోక్సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉండవచ్చన్న అంశంపై చర్చ నడుస్తోన్న క్రమంలో ఆ పార్టీ స్పందించింది. -
‘వారసత్వం కాదు.. బాధ్యత’: రాహుల్ రాయ్బరేలీకి మారడంపై కాంగ్రెస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్బరేలీకి మారడంపై విమర్శలు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
చెప్పానుగా.. కొత్త సీటు వెతుక్కుంటారని: రాహుల్పై మోదీ సెటైర్
రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీపై ప్రధాని మోదీ నుంచి స్పందన వచ్చింది. -
చివరి మొగల్ చక్రవర్తిలా రాహుల్ గాంధీ మిగిలిపోతారు..: భాజపా
అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులపై సస్పెన్స్ వీడింది. దీంతో భాజపా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. -
25 ఏళ్లలో తొలిసారి.. అమేఠీని వదులుకున్న గాంధీలు..!
Amethi: అమేఠీ నియోజకవర్గం నుంచి కిశోరీ లాల్ శర్మ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హస్తానికి మంచి పట్టున్న ఈ స్థానంలో గాంధీ కుటుంబసభ్యులు పోటీలో లేకపోవడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి. -
రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ.. అమేఠీ నుంచి కిశోరీ లాల్
Rahul Gandhi: రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. -
రిజర్వేషన్లను రహస్యంగా లాక్కొంటున్న మోదీ సర్కార్: రాహుల్ గాంధీ
ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
ముందుగా చెప్పకుండానే అవకాశం..
కొన్నేళ్ల క్రితం ఓ యువకుడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. -
రాజ్పూత్లను శాంతపరిచేందుకు మోదీ కృషి
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్కోట్ లోక్సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలపై ఆగ్రహంతో ఉన్న రాజ్పూత్ (క్షత్రియ) వర్గాన్ని శాంతపరిచే చర్యలకు పూనుకున్నారు. -
నాకు ఎన్ని ఓట్లు వస్తే అన్ని మొక్కలు నాటుతా
పశ్చిమ బెంగాల్లోని ఘటల్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ బెంగాలీ నటుడు దేవ్ అలియాస్ దీపక్ అధికారి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఈసీపై విశ్వాసం ఉంచండి
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సమస్యాత్మకంగా మారిన డీప్ఫేక్ వీడియోల అంశాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సమర్థంగా పరిష్కరించగలదన్న విశ్వాసాన్ని దిల్లీ హైకోర్టు వ్యక్తం చేసింది. -
సర్వేలు, పథకాల లబ్ధి సాకుతో ఓటర్ల వివరాల సేకరణపై ఈసీ ఆగ్రహం
ఎన్నికల అనంతరం వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటూనో, సర్వేల సాకుతోనో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బ్రిజ్ భూషణ్ను పక్కనపెట్టిన భాజపా
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు ఈ లోక్సభ ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందా? లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది. -
కురుక్షేత్ర భాజపా అభ్యర్థి నవీన్ జిందాల్ ఆస్తులు.. రూ.వెయ్యి కోట్లు
హరియాణాలోని కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ (54) గురువారం తన నామినేషను పత్రాలు దాఖలు చేశారు. -
ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ అసత్య ప్రచారం
అసత్య ప్రచారాలతో సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని భాజపా ఆరోపించింది. భాజపాకు 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని పేర్కొంటూ గురువారం ఎన్నికల సంఘానికి (ఈసీ) కాషాయ పార్టీ ఫిర్యాదు చేసింది. -
రాహుల్ను ప్రధాని చేయాలని పాకిస్థాన్ తహతహ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువరాజును భారత్కు తదుపరి ప్రధాని చేయాలని పొరుగు దేశం పాకిస్థాన్ తహతహలాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. -
మహిళలకు మోదీ క్షమాపణ చెప్పాలి
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళలపై లైంగిక దాడికి తెగించాడు. ఆయన తరఫున సభ నిర్వహించి, ఓట్లడిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి’అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ డిమాండు చేశారు.
తాజా వార్తలు
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు