Viral video: చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో ఏక్నాథ్ శిందే సందడి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే శనివారం కొల్హాపూర్, అనంతపురం సొసైటీలో ఐదేళ్ల బాలుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొని సందడి చేశారు.
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే శనివారం కొల్హాపూర్, అనంతపురం సొసైటీలో ఐదేళ్ల బాలుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొని సందడి చేశారు. శనివారం కొల్హాపూర్లో పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ, శిందే పాల్గొన్నారు. అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో బస చేశారు. కాగా ఓ ఐదేళ్ల చిన్నారి రిధాన్ తన పుట్టినరోజుకు రావాలని సీఎంను కోరాడు. శిందే వెంటనే అతడి ఆహ్వానాన్ని అంగీకరించారు. అనంతరం రిధాన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించారు. చిన్నారితో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్, రాయ్గఢ్, బారామతి, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్ నియోజకవర్గాలకు మే 7న లోక్సభ మూడో దశలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మిగిలిన స్థానాలకు మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి సర్కారు ఏర్పాటు మోదీకి దుర్లభం: ఖర్గే
కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ ఏర్పాటు చేయడం అత్యంత కష్టమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. -
ఇందిర నుంచి మోదీ నేర్చుకోవాలి: ప్రియాంక
తనను దుర్భాషలాడారంటూ ప్రధాని మోదీ కన్నీరు పెట్టుకోవడానికి బదులు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సూచించారు. -
విమర్శలను మోదీ తట్టుకోలేరు: పవార్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలను తట్టుకోలేరని, అదే సమయంలో ఇతరులకు వ్యతిరేకంగా మాత్రం ఏదైనా మాట్లాడతారని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్పవార్ శనివారం విమర్శించారు. -
మేమొస్తే.. మోదీయే అయిదేళ్లూ ప్రధాని
తాము మళ్లీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీయే అయిదేళ్ల పూర్తికాలంపాటు ప్రధానమంత్రిగా కొనసాగుతారని భాజపా అగ్ర నాయకులు ఉద్ఘాటించారు. -
నాలుగో దశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగో దశలో 96 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న జరగాల్సిన పోలింగ్కు ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. -
కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా గల్లంతు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని, ప్రతిపక్ష పార్టీ హోదాను సైతం కోల్పోవడం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. -
‘నోటా’ కోసం కాంగ్రెస్ విస్తృత ప్రచారం.. ఇందౌర్లో విచిత్ర పరిస్థితి!
-
బహిరంగ చర్చకు సిద్ధమే.. ప్రధాని స్పందనేంటో చెప్పండి: రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. -
75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధాని.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అమిత్ షా
75 ఏళ్లు దాటిన తర్వాత కూడా మోదీనే ప్రధానిగా కొనసాగుతారని అమిత్ షా అన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. -
ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పగలరా? సీఎం నవీన్ పట్నాయక్కు మోదీ సవాల్
ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
భాజపా టికెట్ నిరాకరించిన వేళ.. వరుణ్ గురించి స్పందించిన మేనకాగాంధీ
పీలీభిత్ ఎంపీ వరుణ్ గాంధీకి మరోసారి భాజపా టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన తల్లి మేనకా గాంధీ(Maneka Gandhi) స్పందించారు. ఏమన్నారంటే..? -
మోదీజీ.. ఇందిరాగాంధీ నుంచి ఆ లక్షణాలు నేర్చుకోండి: ప్రియాంక గాంధీ
ప్రజల కష్టాలు వినడానికి బదులు.. తనను టార్గెట్ చేశారంటూ ఎన్నికల వేళ ప్రధాని మోదీ వాపోతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. -
మోదీ తర్వాత మీ ప్రధాని అభ్యర్థి ఎవరు? భాజపాకు కేజ్రీవాల్ ప్రశ్న
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ ఒక పార్టీ కాదని, ఓ సిద్ధాంతమని కేజ్రీవాల్ అన్నారు. తమను అణగదొక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ తర్వాత భాజపా నుంచి ఎవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు. -
ఐదేళ్లలో భారత్ను తయారీ కేంద్రంగా మారుస్తాం: ఖర్గే
కాంగ్రెస్ అధికారం చేపడితే దేశాన్ని తయారీ హబ్గా మారుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. -
పాక్ బాంబులను కొనేవారే లేరు.. : అయ్యర్ వ్యాఖ్యలపై మోదీ సెటైర్
PM Modi: ఓటు బ్యాంకును కోల్పోతామన్న భయంతోనే ముంబయి పేలుళ్లపై కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదని ప్రధాని అన్నారు. ఇప్పుడు పాక్ పేరు చెప్పి సొంత దేశాన్ని ఆ నేతలు భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
మోదీ ఆఫర్.. నో చెప్పిన శరద్ పవార్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(Modi) ఇచ్చిన ఆఫర్ను శరద్ పవార్(Sharad Pawar) తోసిపుచ్చారు. -
దిల్లీలో నేడు కేజ్రీవాల్ రోడ్షో
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కావడంపై విపక్ష ఇండియా కూటమిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. -
ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు ఇస్తాం
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘మహాలక్ష్మి’ పథకాన్ని ఉద్దేశించి మధ్యప్రదేశ్లోని రత్లాం నియోజకవర్గ హస్తం పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది
కాంగ్రెస్ కూడా కొన్ని తప్పులు చేసిందని, భవిష్యత్తులో తమ రాజకీయాలను మార్చుకోవాల్సి ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అంగీకరించారు. -
మీ వ్యాఖ్యలతో ఓటింగ్ శాతంపై ప్రతికూల ప్రభావం
సార్వత్రిక సమరానికి సంబంధించిన పోలింగ్ డేటాపై విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. -
కాంగ్రెస్లో విలీనమయ్యే బదులు.. ఎన్డీయేతో చేతులు కలపండి
కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడంకన్నా భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాలని ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) అధినేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
-
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి